Just In
- 49 min ago
ఈవెంట్కు వెళ్లి బలయ్యా.. హోటల్ గదిలో వాళ్లు నరకం చూపించారు: లక్ష్మీ రాయ్ షాకింగ్ కామెంట్స్
- 1 hr ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 11 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 12 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్తో భర్తతో శ్రియ రచ్చ
Don't Miss!
- News
నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు: కీలక స్థానాల్లో
- Finance
బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా లక్ష్యం ఒక్కటే.. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సోనూ సూద్
వెండితెరపై సోనూ సూద్ ఒక విలన్ గా ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అటు బాలీవుడ్ లోనే కాకవుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా క్రేజ్ అందుకున్నాడు. అయితే ఈ నాలుగు నెలల కాలంలోనే అతనికున్న క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. సినిమా విలన్ ని ఒక హీరోలా దేశంలోని జనాలు ఆకాశానికి ఎత్తేశారు. అయితే సడన్ గా అతనిపై పొలిటికల్ కామెంట్స్ రావడం వైరల్ గా మారింది. ఈ విషయంపై ఎట్టకేలకు సోనూ సూద్ కూడా క్లారిటీ ఇచ్చాడు.

బస్సులను ఏర్పాటు చేసి
యాక్టర్ సోనూ సూద్ గతంలో ఎప్పుడు లేని విదంగా లాక్ డౌన్ కాలంలో తన అసలైన మంచి తనాన్ని చాటుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా వలసలు వచ్చిన కూలీలు సొంత ఇళ్లకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడడంతో వందల కీలమీటర్లు నడవడానికి రోడ్డు బాట పెట్టారు. దీంతో వారికి సోనూ సూద్ అండగా నిలిచాడు. బస్సులను ఏర్పాటు చేసి తీరాలకు చేర్చాడు.

మునుపటి కంటే ఎక్కువ అభిమానం
మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువగా సొంత ఊళ్లకు రోడ్డు బాట పట్టిన పేదలను వారి స్వస్థలాలకు పంపేందుకు సోనూ సూద్ సొంత ఖర్చులతో వందలాది వోల్వో బస్సులను సిద్ధం చేశాడు. ఈ నటుడు చేసిన సహాయానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఇక రీసెంట్ గా ఆంద్రప్రదేశ్ లో ఒక పేద రైతుకు ట్రాక్టర్ కొనివ్వడంతో తెలుగు జనాలు కూడా అతనిని మునుపటి కంటే ఎక్కువగా అభిమానిస్తున్నారు. అయితే అతను చేసిన సహాయంపై కొన్ని రాజకీయ వాదనలు వినిపిస్తుండడం గమనార్హం.

సోనూ సూద్ పాలిటిక్స్?
సోనూ సూద్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారని ప్రధాని మోడీని కలుసుకొని బీజేపీ కండువ కప్పుకునే ఛాన్స్ ఉన్నట్లు నార్త్ మీడియాలో అప్పట్లోనే కథనాలు వెలువడుతున్నాయి. ఇక రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా సోనూ సూద్ డైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా అతనికి అభినందనలు తెలుపడం అలాగే చంద్రబాబు రైతు ఇద్దరు కుతుళ్ళను చదివిస్తాను అని చెప్పడంతో పొలిటికల్ కామెంట్స్ ఎక్కువయ్యాయి.

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సోనూ సూద్
నిజంగా సోనూ సూద్ వెనుక ఒక రాజకీయ వ్యూహం ఉందని సోషల్ మీడియాలో ఓ వర్గం నుంచి కామెంట్స్ రావడం వైరల్ గా మారింది. ఇక ఇటీవల ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో సోనూ సూద్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పట్లో తనకు అలాంటి ఆలోచన ఏమి లేదని ప్రస్తుతం తన దృష్టి పేద వాళ్లకు వీలైనంత వరకు సహాయం చేయాలని ఉందని అన్నాడు.

పదేళ్ల తరువాత ఆలోచిస్తా..
అలాగే పొలిటికల్ ఎంట్రీపై ఇప్పుడే తాను కచ్చితంగా చెప్పలేను అంటూ మరో పదేళ్ల తరువాత దాని గురించి ఆలోచిస్తాను అని చెప్పాడు. ఎందుకంటే ప్రస్తుతం తనకు టాలీవుడ్ బాలీవుడ్ వంటి ఇండస్ట్రీలో మంచి అవకశాలు వస్తున్నాయని అందుకే మరికొన్నాళ్ల పాటు మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఇక సోనూ సూద్ మొత్తానికి రాజకీయాల్లోకి రాను అని కచ్చితంగా చెప్పలేడు. దీంతో అతని ప్రస్తావన ఉంటుందనే కామెంట్స్ వస్తున్నాయి.