తాప్సి సినిమాని బ్యాన్ చేసిన పాకిస్తాన్.. కారణం ఇదే!
పలు బాలీవుడ్ చిత్రాలు పాకిస్తాన్ లో తరచుగా బ్యాన్ కు గురవుతున్నాయి. సీనియర్ నటుడు రిషి కపూర్, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన 'ముల్క్' చిత్రం నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. పాక్ లో మాత్రం ఈ చిత్రం విడుదుల కాలేదు. వివిధ రకాల కారణాలు చెబుతూ అధికారులు ఈ చిత్రాన్ని బ్యాన్ చేసారు. పాక్ ప్రభుత్వ చర్యపై దర్శకుడు అనుభవ్ సిన్హా మండిపడుతున్నారు.
ఇస్లాం ఫోబియా అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందువలనే పాక్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని బ్యాన్ చేసింది. దీనిపై అనుభవ్ సిన్హా స్పందించారు. ఈ చిత్రం ముస్లింలకు వ్యతిరేకంగానో, అనుకూలంగానే తెరకెక్కించిన చిత్రం కాదు. ఈ చిత్రం మన చుట్టూ జరిగే అంశాల గురించి, ప్రేమ గురించి చెప్పే చిత్రం.

ఈ సందర్భంగా పాక్ ప్రేక్షకులని ఉద్దేశించి కూడా అనుభవ్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రేక్షకులని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ చిత్రాన్ని పాక్ ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేసింది. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు మీకు ఈ చిత్రం చూసే అవకాశం కలుగుతుంది. అప్పుడు చెప్పండి మీ ప్రభుత్వం ఈ చిత్రాన్ని ఎందుకు బ్యాన్ చేసిందో అని అనుభవ సింగ్ ట్వీట్ చేసారు.


Click it and Unblock the Notifications











