Don't Miss!
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Tunisha Sharma death నా కూతురితో సహజీవనం.. మరొకరితో అక్రమ సంబంధం.. మూడు నెలలు దారుణంగా!
బాలీవుడ్ నటి తునీషా శర్మ మరణం తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలీబాబా దస్తాన్ ఏ కాబూల్ షోతో పాపులారిటీ సంపాదించుకొన్న ఈ యువ నటి ఇటీవల మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో జరుగుతున్నే షూటింగ్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది.
తన కూతురు మరణానికి కారణం మాజీ ప్రియుడు షీజాన్ ఖాన్ అని ఆరోపించారు. తునీషా శర్మ తల్లి వనితా శర్మ మీడియాతో మాట్లాడుతూ సంచలనం విషయాలను వెల్లడించారు. ఆమె చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
నా కూతురు మరణానికి కారణం
తన కూతురు తునీషా శర్మ మరణం తర్వాత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. షీజాన్, తునీషా ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. 15 రోజుల క్రితం వారిద్దరూ విడిపోయారు. ఆ బ్రేకప్ కారణంగానే తునీషా అప్సెట్ అయింది. ఆ కారణంగానే నా కూతురు తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది అని తల్లి వనిత ఆరోపించారు.
పెళ్లి చేసుకొంటానని మాటిచ్చి మోసం
తునీషాతో అఫైర్ మొదలైనప్పుడు పెళ్లి చేసుకొంటానని మాటిచ్చాడు. అయితే నా కూతురితో డేటింగ్కు ముందే మరో అమ్మాయితో అఫైర్ పెట్టుకొన్నాడు. తునీషాతో బంధం పెట్టుకొని మరో అమ్మాయితో రిలేషన్షిప్ను కొనసాగించాడు. నా కూతురిని మూడు, నాలుగు నెలలు దారుణంగా వాడుకొన్నాడు. శారీరకంగా ఉపయోగించుకొని.. మానసికంగా వేధించాడు అని వనిత ఆరోపించింది.
షీజాన్ను కఠినంగా శిక్షించాలి
నా కూతురు మరణానికి కారణం షీజాన్ ఖాన్ మాత్రమే. అమాయకురాలైన నా బిడ్డను పొట్టనపెట్టుకొన్నాడు. అతడిని కఠినంగా శిక్షించాలని కోరుకొంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అతడిని వదలకూడదు. నా కూతురును కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నాను అని వనితా భోరున విలపించింది. నా కూతురు దర్యాప్తు విషయంలో మీడియా సపోర్టు చేయాలి అని ఆమె వేడుకొన్నది.
బీజేపీ మంత్రి లవ్ జిహద్ ఆరోపణలు
అయితే తల్లి వనిత సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి గిరీష్ మహాజన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తునీషా శర్మ మరణం వెనుక లవ్ జిహద్ అనే కుట్ర ఉంది. హిందూ మతానికి చెందిన అమ్మాయిలను ముస్లిం యువకులచే ఎర వేసి.. వారిని మోసగించడం ఆ తర్వాత వారిని ఇస్లాం మతంలోకి మార్పిడి చేసే కుట్ర జరుగుతున్నది అని గిరీష్ మహాజన్ అన్నారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వం సీరియస్గా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
లవ్ జిహద్ వార్తలపై పోలీసులు స్పందన
తునీషా శర్మ మరణం తర్వాత వస్తున్న లవ్ జిహద్ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. మా దర్యాప్తులో అలాంటి పాయింట్ మాకు కనిపించలేదు. మేము అన్ని రకాల కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాం. విచారణ జరుగుతున్నది. షీజాన్ను అరెస్ట్ చేశాం. అతడి ఫోన్లను స్వాధీనం చేసుకొన్నాం. లవ్ జిహద్ లాంటి కోణం కనిపించలేదు అని ఏసీపీ చంద్రకాంత్ జాదవ్ తెలిపారు.