ఎన్టీఆర్ 'బృందావనం' ఆడియో రైట్స్ ఎంత పలికాయంటే...

By Srikanya

ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు నిర్మించిన బృందావనం చిత్రం ఆడియో పంక్షన్ క్రిందటి ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం ఆడియోని ఆదిత్యా మ్యూజిక్ వారు తీసుకున్నారు. వీరు 55 లక్షల రూపాయలకు ఈ ఆడియోను పోటీలో సొంతం చేసుకున్నట్లు సమాచారం. తమస్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇంత పలకటానికి కారణం కేవలం జూ.ఎన్టీఆర్ మాత్రమే అంటున్నారు. దిల్ రాజు గత చిత్రాల కన్నా ఈ చిత్రం ఆడియో ఎక్కువ రేటుకు పోవటం ఆయనకు శుభసూచికంలా కన్పించిందని చెప్తున్నారు. అక్టోబర్ 8న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, కాజల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందించన ఈ చిత్రం ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆడియోకు మంచి పేరే వచ్చింది కాబట్టి ఆదిత్యా మ్యూజిక్ వారు హ్యాపీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X