Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ చరణ్ కోసం నాగబాబు కొడుకు వెనక్కి
వరుణ్తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. లియో ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. మిక్కీ.జె.మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
సమర్పకుడు ఠాగూర్ మధు మాట్లాడుతూ ''ఇటీవల గోదావరి జిల్లాల్లోని అందమైన లొకేషన్లలో 35రోజులు భారీ షెడ్యూల్ చేశాం. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే చిత్రీకరణతో మూడు పాటలు మినహా మొత్తం పూర్తవుతుంది. మా సినిమాకు పలు టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. అయినా మేం ఇంకా ఏమీ నిర్ణయించలేదు. ప్రస్తుతం పరిశీలిస్తున్నాం. త్వరలో ప్రకటిస్తాం'' అని అన్నారు. ప్రకాష్రాజ్, బ్రహ్మానందం, రావు రమేష్, నాజర్ ఇందులో కీలక పాత్రధారులు.