Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
అఫీషియల్ : ‘సర్దార్’ & ‘బాహుబలి’ ని బీట్ చేసేసింది
హైదరాబాద్ : మహేష్ బాబు రెడీ చేస్తున్న ‘బ్రహ్మోత్సవం' రికార్డ్ లు వింటూంటే ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఓ భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం 13 కోట్ల రూపాయలు ఈ చిత్రం కోసం చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' మరియు రాజమౌళి ‘బాహుబలి' రికార్డ్ లును బ్రద్దలు కొట్టింది.
‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి 11 కోట్లుకు ఓవర్ సీస్ రైట్స్ వెళితే, ‘బాహుబలి' కు 9 కోట్లు అందాయి. ఈ విషయమై క్లాసిక్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు అఫీషియల్ గా ప్రెస్ స్టేట్ మెంట్ ఇచ్చారు.
మరో ప్రక్క ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ సైతం రీసెంట్ గా భారీ మొత్తానికి అమ్ముడైనట్లు సమచారం. ఇప్పటివరకూ మహేష్ కెరీర్ లోనే ఈ రేటు రాలేదని చెప్పుకుంటున్నారు.
జీ తెలుగు వారు ..ఓ భారీ మొత్తానికి (బయిటకు రాలేదు) ఈ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమచారం. ఇంతకు ముందు శ్రీమంతుడు చిత్రాన్ని సైతం జీ తెలుగువారే శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. శ్రీమంతుడు చిత్రంతో టీఆర్పీలు బాగా వచ్చి యాడ్ రెవిన్యూ ని బాగా సంపాదించినట్లు సమాచారం.దాంతో బ్రహ్మోత్సవంపై బాగా ఖర్చు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు.
శ్రీమంతుడు సినిమా ఓవరాల్ గా యుఎస్ లో 18 కోట్లకి పైనే కలెక్ట్ చేయటమే ఈ రేటు ఫిక్స్ చేయటానికి కారణం అంటున్నారు. మరో ప్రక్క ఫ్యామిలీలను టార్గెట్ చేసినట్లున్న ఈ టీజర్ కూడా ప్లస్ అయ్యింది. ఇక్కడ ఆ టీజర్ ని మరోసారి చూడండి.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కోసం ఈ సారి శ్రీ కాంత్ అడ్డాల విజయవాడ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు.