Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'రేయ్' కి ఇప్పుడు రజనీకాంత్ సమస్య
హైదరాబాద్ : చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ని హీరోగా పరిచయం చేస్తూ బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'రేయ్' . ఏ ముహుర్తాన ఈ చిత్రం మొదలు పెట్టారో కానీ రిలీజ్ డేట్ సైతం ఖరారు కాలేకపోతోంది. మొత్తానికి రకరకాల రిలీజ్ డేట్స్ మార్చుకున్న ఈ చిత్రం మే 9 న విడుదల చేయాలని దర్శక,నిర్మాత వైవియస్ చౌదరి నిర్ణయించారు. అయితే అదే రోజున సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం విక్రమ్ సింహా కూడా విడుదల అవుతోంది.
విక్రమ్ సింహా పైనా మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అదే విధంగా ఆ చిత్రం కూడా భారీ ఎత్తున,ఎక్కువ థియోటర్స్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. దాంతో 'రేయ్' చిత్రం పెద్ద పోటిని ఎదుర్కోవటానికి సిద్దం అవుతున్నట్లే అంటున్నారు. వైవియస్ చౌదిరి ప్రతిష్టాత్మకంగా సంవత్సరాల తరబడి కష్టబడి రూపొందించిన ఈ చిత్రం పైనా మంచి అంచనాలే ఉన్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావటంతో ఆ ఫ్యాన్స్ సపోర్టు లభిస్తుంది.
వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ ''వెస్టిండీస్లో సెటిల్ అయిన ఓ కుటుంబానికి చెందిన యువకుడి కథ ఇది. అమెరికాలో జరిగే ఓ సంగీత పోటీ టైటిల్ పోరు నేపథ్యంలో చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఎక్కువ భాగం వెస్టిండీస్, అమెరికాలోనే చిత్రీకరించాం. అందుకే ఆ ప్రాంతాల్లో సినిమా ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నాం. వెస్టిండీస్లో విడుదల కాబోయే తొలి తెలుగు సినిమా ఇది. ఈ ప్రీమియర్ షోల్లో చిత్రబృందమంతా పాల్గొంటుంది'' అని తెలిపారు.
ఏదైనా మేనమామ పోలికలు వస్తే అదష్టవంతులవుతారంటారు. మరి తన మేనమామలా సాయి ధరమ్ తేజ కూడా స్టార్ అవుతాడో లేదో వేచి చూడాల్సిందే... ఎవరేమన్నా మెగాస్టార్ మాత్రం తమ కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమవుతున్న తమ బిడ్డల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానంటున్నారు. దేవదాసుతో సంచలన విజయం నమోదు చేసిన వైవిఎస్ చౌదరి సాయిధరమ్ తేజతో ఎటువంటి హిట్ ఇస్తారో చూడాలి. చిత్రంలో అర్పిత్ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నరేష్, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్.