Don't Miss!
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
'ఊసరవెల్లి' చిత్రం మొత్తం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు
జూ యన్.టి.ఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఊసరవెల్లి'చిత్రం మార్కెట్ పరంగానూ మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం డిస్ట్ర్రిబ్యూషన్ రైట్స్ కోసం ఎందరో పెద్ద మొత్తాలతో ప్రయత్నించినప్పటికీ ఆ పోటీని ఎదుర్కొని ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి ఆంద్ర దేశమంతటా విడుదల చేయటానికి ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పంపిణి హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం.వరసగా పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ ఎదుగుతున్న ఈ సంస్ధ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా వచ్చి ఇలా ఓ పెద్ద సినిమా రైట్స్ తీసుకోవటడం ఎవరూ ఊహించని పరిణామం.
ఇక ఈ మద్యనే నాగార్జున హీరోగా నటిస్తున్న 'రాజన్న' సినిమా డిస్త్రిబ్యుషన్ హక్కులను కైవశం చేసుకుంది.ప్రస్తుతం 'ఊసరవెల్లి' కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్నాయి. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ ఫై బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.