Don't Miss!
- News అక్కడ వైసీపీని ఢీ కొట్టేదెవరు?
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
మొదట రజనీ...తర్వాత బాలయ్య,ఫైనల్ గా లారెన్స్ తో సెటిలైంది
హైదరాబాద్: ఒకహీరోఅనుకుంటే మరో హీరో సీన్ లోకి రావటం కొత్త విషయమేమీ కాదు..ఇప్పుడు అలాగే అంతా బాలయ్యతో చేస్తారు అనుకున్నచిత్రం లోకి తమిళ హీరో లారెన్స్ సీన్ లోకి వచ్చి షాక్ ఇచ్చారు.
కన్నడంలో ఘనవిజయం సాధించిన 'శివలింగ' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు దర్శకుడు పి.వాసు సన్నాహాలు చేస్తున్నారు. 'చంద్రముఖి-2' టైటిల్తో రజనీకాంత్తో ఈ సినిమాని రీమేక్ చేయాలని మొదట్లో భావించారు. కానీ, రజనీ '2.0'తో బిజీగా ఉండడంతో ఆ స్థానంలోకి బాలయ్య వస్తారని అంతా భావించారు. అయితే ఊహించని విధంగా లారెన్స్ సీన్ లోకి వచ్చారు.
అలాగే లారెన్స్ కి జోడీగా 'ఇరుదుసుట్రు' ఫేమ్ రితికాసింగ్ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. ప్రస్తుతం ఆమె 'ఆండవన్ కట్టలై' చిత్రంలో నటిస్తోంది. లైకా, ట్రిటెండ్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా 'శివలింగ' తమిళ రీమేక్ను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. తమిళ నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేసే పనిలో పి.వాసు బిజీగా ఉన్నట్లు సమాచారం. స్ర్కిప్టు సిద్ధంగానే ఈ చిత్రం సెట్స్పైకి వెళ్తుంది.
స్లైడ్ షోలో పూర్తి వివరాలు...
మొదట రజనీ...తర్వాత బాలయ్య,ఫైనల్ గా లారెన్స్ తో సెటిలైంది
ఈ
చిత్రం
శతదినోత్సవ
వేడుకలకు
బాలయ్య
వెళ్లారు.
ఆయన
ఆ
సినిమాను
చూసి
మెచ్చుకున్నారు.
దాంతో
బాలయ్య
ఈ
చిత్రం
చేస్తారని
అంతా
భావించారు.
బిజీగా ఉండటంతో
అయితే ఆయన వరస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఇప్పుడు చేయటం కుదరదని చెప్పినట్లు సమాచారం.
అందుకే లారెన్స్ తో
దాంతో వరసగా ముని,కాంచన,గంగ అంటూ హర్రర్ కామెడీ లు చేసిన లారెన్స్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు పి.వాసు.
రజనీతో..
దీన్ని తమిళ రీమేక్లో సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తారనే ప్రచారం జోరుగా సాగింది.
మొదట రజనీ...తర్వాత బాలయ్య,ఫైనల్ గా లారెన్స్ తో సెటిలైంది
అందుకే ఆయనకు దర్శకుడు పి.వాసు ప్రత్యేకంగా రజనీకాంత్ కు చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసి చూపించడంతో ఈ ప్రచారం జరిగింది.
సూపర్ హిట్స్
తమిళంలో మన్నన్, చంద్రముఖి వంటి పలు సూపర్హిట్ చిత్రాల సృష్టికర్త పి.వాసు ఈ మధ్య కన్నడం, తెలుగు చిత్రాలపై దృష్టి సారించారు.
రీమేక్
కన్నడంలో ఈయన రవిచంద్రన్ నవ్యానాయర్ జంటగా దృశ్యం చిత్రాన్ని రీమేక్ చేశారు.
ఆ తరువాత ...
శివరాజ్కుమార్ వేదిక హీరోహీరోయిన్లుగా శివలింగ చిత్రానికి దర్శకత్వం వహించారు. అది అక్కడ ఘన విజయం సాధించింది.
అనుష్కని...
తాజా శివలింగ తమిళ రీమేక్లో లారెన్స్ను హీరోగానూ ఆయనకు జంటగా నటి అనుష్కను నటింపజేసే ప్రయత్నాలు జరుగాయన్నది కోలీవుడ్ వర్గాల టాక్.
టైటిల్ గా
దీనికి చంద్రముఖి-2 అని టైటిల్ను నిర్ణయించనున్నట్లు సమాచారం. అయితే లారెన్స్ ప్రస్తుతం మొట్టశివ కెట్టశివ చిత్రంలో నటిస్తున్నారు.