Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మరో స్టార్ హీరో సినిమాలో యాంకర్ అనసూయ స్పెషల్ రోల్
గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్న జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మళ్ళీ సినిమాలతో బిజీబిజీగా మారింది. ఒకవైపు షోలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలతో కూడా బిజీబిజీగా మారుతోంది. పాత్ర నచ్చితే చేయడానికి ఎల్లప్పుడు సిద్ధమే అంటూ మంచి రోల్స్ ఎంచుకుంటోంది. ఇక మొదటిసారి ఆమె మలయాళం ఇండస్ట్రీలోకి కూడా వెళుతున్నట్లు టాక్ వస్తోంది.
రంగస్థలంలో రంగమ్మత్తగా కనిపించినప్పటి నుంచి కూడా అనసూయ తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ మధ్య నాగార్జున సోగ్గాడే చిన్న నాయన సినిమాలో కూడా టైటిల్ సాంగ్ తో రచ్చ చేసిన అనసూయ క్షణం వంటి సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించి నటిగా తన స్థాయిని మరింత పెంచుకుంది. రంగస్థలం సినిమాతో అనసూయ రేంజ్ మరో లెవెల్ కు వెళ్లిందనే చెప్పాలి.
ఇక మళయాళం ఇండస్ట్రీలో కూడా అడుగుపెడుతున్నట్లు టాక్ వస్తోంది. మళయాళం స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా నటిస్తున్న భీష్మ పర్వంలో ఆమె ఒక ముఖ్యమైన పాత్ర కోసం సెలెక్ట్ అయినట్లు సమాచారం. పాత్ర నచ్చడంతో అనసూయ కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఒప్పుకున్నట్లే టాక్ వస్తోంది. అలాగే గోపీచంద్ రాబోయే సినిమాలో ఒక ప్రయోగాత్మకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గోపిచంద్ మారుతి కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో గతంలో ఎప్పుడు కనిపించని విభిన్నమైన పాత్రలో అనసూయ దర్శనమివ్వనుందట.