Don't Miss!
- Sports వేరీజ్ `మ్యాడ్` మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
రామ్ చరణ్ తో మరో మల్టిస్టారర్...డిటేల్స్
మరో ప్రక్క తెలుగులో నాగ చైతన్య-సునీల్ మల్టీ స్టారర్గా రూపొందిన 'తడాఖా' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తాజాగా బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూటీవీ మోషన్ పిక్చర్స్, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈచిత్రాన్ని బాలీవుడ్లో సంయుక్తంగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
బాలీవుడ్ వెర్షన్లో నాగ చైతన్య పాత్రకు షాహిద్ కపూర్ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ....ఇంకా ఈ విషయం ఫైనల్ కాలేదని అంటున్నారు. నాగ చైతన్య పాత్రకు రామ్ చరణ్ను తీసుకునే ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జంజీర్ సినిమాలో రామ్ చరణ్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాలు చేయడంతో కరణ్ జోహార్ దృష్టి రామ్ చరణ్పై పడినట్లు బాలీవుడ్ టాక్.
ఇది కాకుండా .. రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న భారీ చిత్రం జంజీర్. ఈ చిత్రాన్ని తెలుగులో తుఫాన్ పేరుతో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 6న ఈచిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒరిజినల్ హిందీ జంజీర్ చిత్రంతోనే అమితాబ్ బచ్చన్కు యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే. అమితాబ్ చలన చిత్ర జీవితంలోనే జంజీర్ ప్రత్యేక చిత్రం. దానికి రీమేక్ గా తెరకెక్కిస్తున్న తుఫాన్ చిత్రం కూడా టాలీవుడ్లో రికార్డుల ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమౌతోంది. ఇటీవలే రామ్ చరణ్ను అమితాబ్ పొగడ్తలతో ముంచెత్తారు. 'రామ్ చరణ్ అద్భుతమైన నటుడు. ఈ చిత్రంలో తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడని నమ్ముతున్నా' అని ప్రశంసించారు.
ఎవడు చిత్రం అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది. దిల్ రాజు మాట్లాడుతూ...-'' 'ఎవడు' ని రైట్ టైమ్ చూసి విడుదల చేస్తాం. అఫీషియల్ ప్రెస్ నోట్ ఇస్తాం. ఈ లోగా విడుదల తేదీ విషయంలో ఏ విధమైన ఊహాగానాలు చేయవద్దని మీడియాని కోరుతున్నాను అన్నారు. అలాగే రెండేళ్లు ఈ సినిమా కోసం శ్రమించాం. ఈ సినిమా చూశాను. కథ విన్నప్పుడు ఎంత ఉద్వేగానికి లోనయ్యానో, చూసినప్పుడు అంతే ఉద్వేగానికి లోనయ్యాను. ఇదే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగితే ఈ సినిమా బ్లాక్బస్టర్ అవ్వడం ఖాయం'' అని చెప్పారు.