Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘పల్నాడు’ లో ‘అత్తారింటికి దారేది ’ సీన్
హైదరాబాద్ : అదేంటి విశాల్ తాజా చిత్రం 'పల్నాడు' లో సూపర్ హిట్ చిత్రం 'అత్తారింటికి దారేది ' ఉండటమేంటి..దానికి విజిల్స్ పడటం ఏంటీ అని డౌట్ పడుతున్నారా... అది నిజమే. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం రిలీజైన రోజు మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సినిమా డల్ గా నడుస్తున్న సమయంలోనూ జనం విజిల్స్ తో థియోటర్ మారు మ్రోగింది అంటే దానికి కారణం ఓ సన్నివేశంలో 'అత్తారింటికి దారేది ' ని చూపెట్టడమే.
'పల్నాడు' సెకండాఫ్ లో...విలన్ ...ఓ రాజకీయనాయకుడుని థియోటర్ లో కలుసుకునే సీన్ ఉంది. ఆ సీన్..జరిగే థియోటర్ లో...అత్తారింటికి దారేది చిత్రం ప్రదర్శింపబడుతూంటుంది. విలన్ ...పొలిటీషియన్ తో మాట్లాడేటప్పుడు... అత్తారింటికి దారేది సీన్స్... కనపడతాయి. అప్పటివరకూ డల్ గా ఉన్న థియోటర్ ఈ సీన్ తో ..పవన్ కనపించటంతో ఉషారు వచ్చింది.
పందెం కోడి, భరణి, వాడు వీడు, వెంటాడు వేటాడు వంటి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశాల్ తొలిసారి విశాల్ ఫిలింఫ్యాక్టరీని స్థాపించి స్వయంగా నిర్మించిన ద్విభాషా చిత్రం 'పల్నాడు'. 'నా పేరు శివ' ఫేం సుశీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'గజరాజు' ఫేం లక్ష్మీమీనన్ హీరోయిన్.
విశాల్ అంటే పదిమందిని ఒక్కడే తంతాడు. ఇదీ జనాల్లో ఉన్న ఇమేజ్. దానికి దూరంగా చేసిన తొలి ప్రయత్నమిది. దాదాపు పదేళ్ల తర్వాత నా ఇమేజ్కి పూర్తి ఆపోజిట్ పాత్రలో కనిపిస్తున్నా. కొట్టాలంటే భయపడే కుర్రాడిగా ఈసారి కనిపిస్తున్నా. నా కెరీర్లో మర్చిపోలేని పాత్ర ఇది అన్నారు విశాల్.