Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పాపం, దిల్ రాజు అంటున్నారు
కెమెరామెన్ గంగతో రాంబాబు ను ఏకంగా పది పనె్నండు కోట్లకు పై మొత్తానికే నైజాం హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు గగనం, ఓ మై ఫ్రెండ్ కూడా లాస్ లే తప్ప కలిసి వచ్చేందేమీ లేదు. వాటికి ముందు ఆకాశమంత, జోష్, మరోచరిత్ర, రామరామ కృష్ణకృష్ణ గట్టిదెబ్బలే తీసాయి. ఇక తాజాగా నాగార్జున ఢమరుకం ఒకటి మిగిలి వుంది. ఆ చిత్రం రిలీజ్ సైతం వెనక్కి పోయింది.
అయితే నిర్మాతగా మాత్రం ఇప్పుడు అందరి దృష్టీ పెద్ద మల్టీస్టారర్గా పేరుపడుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మీదే ఉంది. ఈ చిత్రంతో అయినా ఆయన అదృష్టం తిరుగుతుందేమో అంటున్నారు. 'నా' అంటే నా కుటుంబం అని అర్థం. ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, అన్న, వదిన, బాబాయ్... ఇలా ఎన్ని బంధాలున్నాయో. అవన్నీ మా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో చూపిస్తున్నాం. సంతోషం అనేది విలాసవంతమైన జీవితాల్లోనో, ఖరీదైన నివాసాల్లోనో ఉండదు. మన చుట్టూ ప్రేమించే వాళ్లుంటే.. పూరి గుడిసెలోనైనా హాయిగా బతికేయొచ్చు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విజయవంతమైంది అక్కడే అంటున్నారు దిల్రాజు. ఆయన తాజా చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరగుతోంది.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో వెంకటేష్, మహేష్బాబు హీరోలుగా నటిస్తున్నారు. సమంత, ప్రకాష్రాజ్, జయసుధ, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ ''భారతదేశం ఓ సీతమ్మ వాకిలి. అందులో సిరిమల్లె చెట్టు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. అందులోని మమతానురాగాలను మా సినిమాలో చూపిస్తున్నాం. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది. మిక్కీ.జె.మేయర్ సంగీతం ఆహ్లాదకరంగా సాగిపోతుంది'' అని చెప్పారు.
సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, రోహిణి హట్టంగడి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: కె.వి.గుహన్, కళ: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.