Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దిల్ రాజుపై నిషేధం?
ఎ.పి.ఫిలిం ఛాంబర్..ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై బ్యాన్ పెట్టడానికి రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన తాజాగా నిర్మిస్తున్న జోష్ చిత్రం విషయంలో ఈ నిర్ణంయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ పబ్లిసిటీ నిమిత్తం ఛానెల్స్ లో వేసే ప్రొమోలు రేట్లు విషయంలో ఫిలిం ఛాంబర్ ఆ మధ్య మాటీవీ, జెమినీ, ఈటీవీ వంటి కొన్ని ఛానెల్స్ కి సినిమాకు సంభందించిన ఏ విషయంలోనూ సహకరించరాదనే నిర్ణయం తీసుకున్నారు. అయితే దిల్ రాజు తన జోష్ చిత్రం ఆడియో పంక్షన్ లైవ్ ని మాటీవీకి ఇవ్వటంతో ఛాంబర్ వారు గుర్రుగా ఉన్నారు. అంతేగాక దిల్ రాజు తమ జోష్ ప్రొమోలు సైతం ఆ ఛానెల్స్ కి పబ్లిసిటీకి ఇచ్చారు. దాంతో వారు మరింత సీరియస్ గా యాక్షన్ తీసుకోవటానికి సమాయత్తమవుతున్నట్లు సమాచారం. అయితే మగధీర ఆడియో పంక్షన్ కూడా మాటీవీలో లైవ్ ఇవ్వటంతో అల్లు అరవింద్ పై యాక్షన్ తీసుకున్న తర్వాతే ఈ మేటర్ తేల్చాల్సి ఉంటుందని కొందరు సీనియర్స్ అంటున్నారు.