Don't Miss!
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- News జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
దేశాన్ని ఆకర్షించేలా RRRలో మరో చారిత్రాత్మక అంశం.. ఎమోషనల్ సీన్
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ RRR ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో గాని.. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన రూమర్స్ తగ్గేలా లేవని అనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శకుడు రాజమౌళి చారిత్రాత్మక అంశాలను తీసుకొని చేస్తున్న ఈ భారీ సినిమాలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయనేది ప్రతి ఒక్కరిలో ఎంతగానో ఆసక్తిని కలిగిస్తోంది.
ఇక కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో ఈ పోరాట యోధుల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే బాలీవుడ్ ఆడియెన్స్ కి మాత్రం అంతగా అవగాహన ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి పాన్ ఇండియన్ సినిమాలో దేశాన్ని ఆకర్షించే ఒక ఇన్సిడెంట్ ని జక్కన్న కథలో జోడించినట్లు సమాచారం. ఇది స్వాతంత్ర్య సమరయోధుల కలయిక యొక్క కల్పిత కథ అని రాజమౌళి ముందే చెప్పడంతో వాస్తవ ఘటనలపై అంచనాలు ఉండకపోవచ్చు.
అయితే భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత విషాదకరమైన సంఘటనలలో ఒకటైన జలియన్ వాలా బాగ్ ఉదంతంను సినిమాలో చూపించనున్నారట. 1919 లో బైసాఖి పండుగ సందర్భంగా అమాయక సిక్కు యాత్రికులపై బ్రిటిష్ జనరల్ డయ్యర్ చేసిన ఉచకోత ఫలితంగానే వెయ్యి మంది భారతీయులు మరణించారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతం చేయాలని భారతీయులను ప్రేరేపించిన ముఖ్యమైన సంఘటనలలో ఇది కూడా ఒకటి. అయితే అలాంటి పాయింట్ ని జక్కన్న RRRలో చూపించనున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.