Don't Miss!
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Finance Adani-Birla: అదానీని టార్గెట్ చేసిన బిర్లా.. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు..
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ పై దాడి వెనక సీక్రెట్
నిన్న వికారాబాద్ లో మహేష్ బాబుపై తెలంగాణ వాదులు దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మీడియాలో హైలెట్ గా కూడా వచ్చింది. అయితే ఈ దాడి వెనక అస్సలు ఉద్దేశ్సాలు వేరని, వేరొక వాస్తవం ఉందని స్దానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు దూకుడు చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈ దాడి జరిగింది. వారు చెప్పేదాని ప్రకారం సంవత్సరం క్రితం ఎటివి నిర్మించిన బిందాస్ షూటింగ్ ను కూడా వికారాబాద్ ప్రాంతంలో అడ్డుకున్నారు. ఇప్పుడు దూకుడు చిత్రం నిర్మిస్తుంది కూడా ఎటివీ వారే. ఎటివి వారికి లోకల్ గా స్దానికులతో సమస్యలు ఉన్నాయి.
నాలుగేళ్ల క్రితం ఎటివి సంస్థ యాజమాన్యం వికారాబాద్ ప్రాంతంలో డెబ్బై ఎకరాలుకు పైగా భూములు కొనుగోలు చేసింది. కొనుగోలు చేసినప్పుడు స్థానికులకు అక్కడ స్థాపించే స్టీల్ కర్మాగారం, ఇంకా ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తూ ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చేశారు. అయితే భూములు ఇచ్చేసి, కంపెనీలు ప్రారంభమైన తర్వాత అక్కడి వారికి కాకుండా ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చారని అభియోగం. దీంతో నాలుగేళ్లుగా స్థానికంగా ఎటివి యాజమాన్యంపై విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దాని ఎఫెక్టే సినిమాలను అడ్డుకోవటం అంటున్నారు.
ఎటివి నిర్మించే సినిమాలను తెలంగాణవాదులు పేరిట స్థానికులు అడ్డుకున్నట్లు సమాచారం. ఎందుకంటే ఎటివి సంస్థ కాకుండా ఇతర సినిమాలను వేటినీ వికారాబాద్లో అడ్డుకోకపోవడం గమనించతగ్గ విశేషం. ఎందుకిలా తెలంగాణ పేరు చెప్పి అడ్డుకోవటం అంటే...తెలంగాణ వాదం లేకపోతే కేసులు పెడతారని భావించి ఇలా చేస్తున్నట్లు వికారాబాద్ వాసులు కొంతమంది చెప్తున్నారు. ఆ కంపెనీ వల్ల నష్టపోయి, కడుపు మండిన వారే ఇలా చేసినవారిలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న టీఆర్ఎస్ నేతలు మద్ధతిచ్చారని తెలుస్తోంది.