Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హసన్ ఆలీ వివాదంలో రామ్ చరణ్ మగధీర గుర్రం?
మగధీరలో చిత్రంలో రామ్చరణ్తేజ వాడిన గుర్రం ఇప్పుడు సినీ,రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హఠాత్తుగా ఈ గుర్రం టాపిక్ ఏమిటా అంటే దానకి కారణం హసన్ అలీ వ్యవహారం. మగధీర సినిమాలో వాడిన గుర్రం హసన్ ఆలీకి సంబంధించి గుర్రపుశాల నుంచి తెచ్చినదేనని, ఇప్పటికీ ఆ గుర్రం చిలుకూరులోని చిరంజీవి ఫాంహౌస్లో ఉందని అంతటా వినపడుతోంది. అంతేగాక రామ్చరణ తేజ కూడా పూణేలోనే హసన్ ఆలీకి చెందిన రేస్కోర్టులోనే గుర్రపుస్వారీలో శిక్షణ పొందారని చెప్తున్నారు. అయితే అప్పటికీ హసన్ ఆలీకి ఈ చట్టవిరుద్ధమైన అంశాలకు సంబంధం ఉందన్న సంగతి తెలియకపోవచ్చునని చెప్తున్నారు. మరో ప్రక్క చిరంజీవికి హసన్ ఆలీతో సంబంధం ఉన్నా,లేకపోయినా తన వాంగ్మూలంలో రాజకీయాల్లోకి వచ్చిన సినీ హీరో అనగానే అందరి దృష్టి ఆయన మీదనే పడింది.దాంతో చిరంజీవి వెంటనే స్పందించి ఈ వార్తలను ఖండించారు.సినిమాలు తప్ప హసన్ ఆలీ ఎవరో తెలియదని ఇవాళ మీడియా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.