Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
హాట్ న్యూస్: నితిన్ మళ్లీ అదే దర్శకుడుతో ఖరారు
హైదరాబాద్ : ప్రస్తుతం ఛార్మీతో చేస్తున్న "జ్యోతిలక్ష్మి" తర్వాత పూరి ఏ చిత్రం చేస్తారు ...మహేష్ తోనా, చిరంజీవితోనా అనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే మాకు అందిన సమాచారం ప్రకారం..టెంపర్ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని నితిన్ తో చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఓ స్టోరీ లైన్ ని విన్న నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
చిన్నదాన నీ కోసం చిత్రం తర్వాత అనేక స్క్రిప్టులు విన్న నితిన్ ఈ ఒక్క ప్రాజెక్టుని మాత్రమే ఓకే చేసాడని తెలుస్తోంది. ఆ సినిమా ఫెయిల్యూర్ కావటంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు చెప్తున్నారు. మరో ప్రక్క పూరి జగన్నాథ్..వరుణ్ తేజ తో ఓ చిత్రం,టెంపర్ రీమేక్ చిత్రాలు కమిటయ్యి ఉన్నారు. అన్నీ బాగుంటే చిరంజీవి 150 చిత్రంగా తన దగ్గర ఉన్న ఆటో జానీ చిత్రం చేస్తారు.
జ్యోతిలక్ష్మీ విషయానికి వస్తే...
ఛార్మి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందనున్న జ్యోతిలక్ష్మి చిత్రం ముహూర్తం జరిగింది. ఈ నేపధ్యంలో ఆమె ఈ సెక్సీ ఇమేజ్ ని షేర్ చేస్తూ ముహూర్తం జరిగిందని తెలియచేసింది.
ఫుల్ జోరుమీదున్న స్పీడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా పూర్తవటంతో తన భవిష్యత్ సినిమాల పనిలో పడిపోయాడు. ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీతో కొత్త సినిమా తీయబోతున్నాడు. ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్ తెలిపాడు. తను ఛార్మీ తో తీయబోయే సినిమా పేరు జ్యోతిలక్ష్మి అని వెల్లడించాడు. అయితే ఈ సినిమా నర్తకి జీవిత కథాంశంతో రూపొందిస్తున్నామని వెల్లడించాడు.
పేరు క్యాచీగా ఉండాలని ఆలోచిస్తే జ్యోతిలక్ష్మి అయితే బాగుంటుందని అది ఓకే చేశామని. అంతేగానీ ఈ సినిమా జ్యోతిలక్ష్మి నిజ జీవితానికి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ చిత్రం పూర్తికాగానే మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తీస్తున్నట్లు తెలిపాడు.