Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ బాబుని ఆ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తొలగించినట్టు...!?
మణిరత్నంతో సినిమా అంటే ఎంతటి హీరోలైనా అన్నీ వదిలేసుకుంటారు. అలాంటి విషయమే హీరో మహేష్ బాబుకి కూడా జరిగిపోయింది. మణిరత్నం మొదలు పెట్టబోయే ఓ భారీ చారిత్రాత్మక చిత్రంలో విక్రమ్, మహేష్ హీరోలంటూ మీడియాలో చాలా వార్తలే వచ్చాయి. వీటన్నింటినీ నిజం చేస్తూ 'పోన్నియన్ సెల్వం" అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని మణితర్నం కూడా ఒప్పేసుకుని స్ర్కిప్ట్ రెడీ చేయించేసాడు.
దాదాపుగా అన్ని కుదర్చుకొన్న ఈ ప్రాజెక్ట్ నుండి మహేష్ బాబుని తొలగించి ఇప్పుడు సూర్యని తీసుకున్నట్టు తమిళ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. విక్రమ్ మరియు సూర్య ఇంతకు ముందే బాల డైరెక్షన్ లో పితామగన్ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇదే నిజం అయితే తెలుగు తమిళుల మధ్య చిత్ర పరిశ్రమలో జరుగుతున్న యుద్దానికి ఆజ్యం పోసినట్లే. మహేష్ బాబుకి తమిళంలో క్రేజ్ లేదనా? లేక అక్కడి సూర్యకి తెలుగులో మార్కెట్ ఉందనా?