twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    300 కోట్ల బడ్జెట్‌తో రాంచరణ్ పాన్ ఇండియా మూవీ.. దర్శకుడు ఎవరంటే?

    |

    ఉప్పెన చిత్రంతో భారీ విజయాన్ని అందుకొన్న బుచ్చి బాబు సనా తన రెండో చిత్రం కోసం ఏడాదికిపైగానే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో ఓ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయాలని ప్లాన్ చేశాడు. ఆ సినిమాకు ఎన్టీఆర్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ RRR సినిమాతో బిజీగా ఉండటంతో ఎదురు చూశాడనే కథనాలు కూడా మీడియాలో కనిపించాయి.

    అయితే చివరకు ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్ వర్కవుట్ కాకపోవడంతో మరికొంత కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ ఒకే చెప్పడంతో బుచ్చిబాబు సినిమా పట్టాలెక్కేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్, రూమర్లు అభిమానులకు మరింత కిక్కునిచ్చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    Is Ram Charan and Buchi Babu Sana movie to made with 300 crores?

    ప్రస్తుతం రాంచరణ్ తన కెరీర్‌లో 15వ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో చేస్తున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమా తర్వాత రాంచరణ్, బుచ్చిబాబు సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం కనిపిస్తున్నది.

    రాంచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఇంకా పేరుపెట్టని సినిమాకు వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. కబాడ్డీ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కి ఈ చిత్రాన్ని జనవరిలో షూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

    పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించేందుకు వెంకట సతీష్ కిలారు రెడీ అవుతున్నట్టు సమాచారం.

    English summary
    Uppena fame Buchi Babu Sana's Ram Charan is going to on sets january 2023. This movie is going to produce Rs.300 crores. Produced by Venkata Satish Kilaru
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X