Don't Miss!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
పవన్ తో చేయించిందే కళ్యాణ్ రామ్ తోనూ..
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన హిట్ చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జర్నలిస్ట్ గా కనిపిస్తారు. సామాజిక అంశాలపై స్పందించే ఈ పాత్రకు మంచి పేరే వచ్చింది. ఇప్పుడు కొంచెం అటూ ఇటూలో కళ్యాణ్ రామ్ అలాంటి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ..జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పటాస్ లోపోలీస్ గా కనిపించి అలరించిన కళ్యాణ్ రామ్ ...ఈ సినిమాలో జర్నలిస్ట్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారని చెప్తున్నారు.
హే 'రామ్ బాబు' ('...గంగతో రాంబాబు' రివ్యూ)
నందమూరి కళ్యాణ్ రామ్ దీనికి నిర్మాత. 'టెంపర్' తర్వాత పూరి జగన్నాథ్, 'పటాస్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మే నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనుంది.
ఈ చిత్రానికి కథ, కూర్పు, మాటలు, దర్శకత్వం పూరిజగన్నాథే. త్వరలో మిగతా నటీనటులు, టెక్నిషియన్ల వివరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాధ్..రోగ్ చిత్రం షూటింగ్ లో ఉన్నారు. ఈ చిత్రం పూర్తవగానే కళ్యాణ్ రామ్ తో చిత్రం మొదలుకానుంది.