Don't Miss!
- News పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము- అభిమానులకు జనసేన కీలక సూచన..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘బాద్షా’ ఎఫెక్ట్: శ్రీనువైట్లకు మహేష్ వార్నింగ్
శ్రీను వైట్ల గత సినిమా 'బాద్ షా' చిత్రం హిట్ టాక్ వచ్చినప్పటికీ చివరకు నిర్మాతకు నష్టాలే మిగిలాయనే ప్రచారం జరిగింది. నిర్మాతతో అనవసర ఖర్చులు పెట్టించి మూవీ బడ్జెట్ భారీగా పెంచడం వల్లనే ఇలా జరిగిందని చాలా మంది వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు శ్రీను వైట్లను కంట్రోల్లో పెట్టాలనే యోచనకు వచ్చాడట.
'ఆగడు' సినిమాను రూ. 40 కోట్ల బడ్జెట్ మించకుండా పూర్తి చేయాలని, అప్పుడే నిర్మాతలకు, బయ్యర్లకు మంచి జరుగుతుందని మహేష్ బాబు సూచించినట్లు తెలుస్తోంది. తన సినిమా నష్టాల పాలైతే తనకే చెడ్డపేరు కాబట్టి మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మహేష్ బాబు ఆలోచన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఈచిత్రం మహేష్ బాబు సరసన తమన్నాను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దూకుడు చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈచిత్రాన్ని కూడా తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు దశలోనే ఉన్న ఈచిత్రం వచ్చే ఏడాది మొదలు కానుంది.