Just In
Don't Miss!
- Sports
గబ్బా హీరో రిషభ్ పంత్.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.!
- Finance
కంపెనీలు ఆ నిర్ణయం తీసుకుంటే.. వచ్చే అయిదేళ్లలో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15%
- News
Inside info:జగన్ -షా మీటింగ్లో ఏం జరిగింది.. మళ్లీ ఢిల్లీకి సీఎం: ఏపీలో కీలక పరిణామాలు
- Lifestyle
బాదం చట్నీతో బోలెడన్నీ లాభాలు... దీన్ని ఈ సమయంలోనే ఎక్కువగా తినాలట...!
- Automobiles
2030 నాటికి భారత్లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘బాద్షా’ ఎఫెక్ట్: శ్రీనువైట్లకు మహేష్ వార్నింగ్
శ్రీను వైట్ల గత సినిమా 'బాద్ షా' చిత్రం హిట్ టాక్ వచ్చినప్పటికీ చివరకు నిర్మాతకు నష్టాలే మిగిలాయనే ప్రచారం జరిగింది. నిర్మాతతో అనవసర ఖర్చులు పెట్టించి మూవీ బడ్జెట్ భారీగా పెంచడం వల్లనే ఇలా జరిగిందని చాలా మంది వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు శ్రీను వైట్లను కంట్రోల్లో పెట్టాలనే యోచనకు వచ్చాడట.
'ఆగడు' సినిమాను రూ. 40 కోట్ల బడ్జెట్ మించకుండా పూర్తి చేయాలని, అప్పుడే నిర్మాతలకు, బయ్యర్లకు మంచి జరుగుతుందని మహేష్ బాబు సూచించినట్లు తెలుస్తోంది. తన సినిమా నష్టాల పాలైతే తనకే చెడ్డపేరు కాబట్టి మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మహేష్ బాబు ఆలోచన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఈచిత్రం మహేష్ బాబు సరసన తమన్నాను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దూకుడు చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈచిత్రాన్ని కూడా తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు దశలోనే ఉన్న ఈచిత్రం వచ్చే ఏడాది మొదలు కానుంది.