Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
బాలకృష్ణతో పోటీపడటానికి నాగచైతన్య రెడీ !?
నాగచైతన్య, సుకుమార్ కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న చిత్రం సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇక సంక్రాంతికి ఇప్పటికే బాలకృష్ణ,దాసరి కాంబినేషన్ లో రెడీ అవుతున్న..పరమవీర చక్ర చిత్రాన్ని ప్రకటించారు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సినీ స్టార్ గానూ, మేజర్ గానూ ద్విపాత్రలు చేస్తున్నారు. ఇక తమన్నా హీరోయిన్ గా చేస్తున్న నాగచైతన్య చిత్రానికి ఇప్పటివరకూ టైటిల్ నిర్ణయించలేదు. అయితే సుకుమార్...ఈ చిత్రం కోసం 'దటీజ్ మహాలక్ష్మి.." అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ టైటిల్ హీరోయిన్ ఓరియెంటెడ్ ఉందని నాగచైతన్య నసుగుతున్నట్లు చెప్తున్నారు. అలాగే నాగేశ్వరరావు, దాసరి కాంబినేషన్ లో వచ్చిన ప్రేమాభిషేకం చిత్రంలోని నా కళ్ళు చెప్తున్నాయి...నిన్ను ప్రేమిస్తున్నాయని..నా హృదయం చెప్తోంది..పాటని రీమిక్స్ చేసి నాగచైతన్య, తమన్నాలపై చిత్రీకరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రం గురించి చెబుతూ...ప్రతీ ఒక్కరికీ నచ్చే ఎలమెంట్ ఈ స్క్రిప్టులో ఉంది ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటున్నారు. మరి వచ్చే సంక్రాంతికి నాగచైతన్య, బాలయ్యలలో ఎవరు విన్ అవుతారో చూడాలి.మరో ప్రక్క రామ్ గోపాల్ వర్మ..తన తాజా చిత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కూడా సంక్రాంతికే రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు.