Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరో సూర్య రిజెక్ట్ చేసిన కథతో నాగ్
ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తారని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కుదుర్చుకున్న ఒప్పంద ప్రకారం బెల్లంకొండ సురేష్ సంస్థలో గౌతమ్మీనన్ ఓ సినిమా చేయాల్సివుందని, అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని...పస్తుతం గౌతమ్మీనన్ డేట్స్ ఖాళీగా వుండటంతో నాగార్జునతో సినిమా చేయబోతున్నారని ఫిల్మ్నగర్ సమాచారం.
మరో ప్రక్కన నాగ చైతన్య కు 'తడాఖా' వంటి హిట్ ఇచ్చిన డాలి తోనూ నాగార్జున చేయనున్నారని తెలుస్తోంది. దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించే చిత్రానికి నాగార్జున ఇదివరకే అంగీకారం తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్మీదకు వెళ్లనుందని చెప్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల్లో ఏది ముందు పట్టాలు ఎక్కుతుందో తెలియాలి. భాయ్ డిజాస్టర్ టాక్ తో నాగార్జున ...కథలపై చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
'భాయ్' చిత్రాన్ని ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూట్ చేసిన నాగార్జున నష్టపోయారని చెప్పకతప్పదు. అయితే తొలిప్రయత్నం విఫలమైనా ఏ మాత్రం బెదురు లేకుండా ముందుకు సాగుతున్నారు నాగార్జున. తాజాగా రూపొందుతున్న అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ 'మనం' చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట నాగార్జున.