Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'బిందాస్' డైరక్టర్ తో నాగార్జున చిత్రం!?
మంచు మనోజ్ తో 'బిందాస్' చిత్రాన్ని రూపొందించిన నూతన దర్శకుడు వీరూ పోట్లకి మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. నాగార్జున హీరోగా కామాక్షి కళా మూవీస్ వారు నిర్మించే చిత్రానికి సంభందించి చర్చలు జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్, కామాక్షి వారు కలిసి కంబైన్డ్ గా ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉంది. ఈ మేరకు కథా చర్చలు వీరూ పోట్లతో జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక అజయ్ భుయాన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా చేసే చిత్రం కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. దానిని కామాక్షి కళా మూవీస్ పతాకంపైనే నిర్మించనున్నామని శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇక రెండు వారాలు క్రితం ఇదే బ్యానర్ కిరణ్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ కేడీ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుందీ ఈ చిత్రం.దాంతో వీరూ పోట్ల చిత్రం మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందు నాగార్జున చేసిన సంతోషం చిత్రానికి వీరూపోట్ల మూల కథ అందించిన సంగతి తెలిసిందే.