Don't Miss!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ మళయాళ చిత్రం..నాగార్జున 'పయినం' కథ ఒక్కటే?
నాగార్జున, రాధామోహన్ (ఆకాశమంతా దర్శకుడు)కాంబినేషన్లో పయినం అనే చిత్రం రూపొందతోందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం కథ పూర్తిగా ఓ ప్లైట్ హైజాక్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. కాందహార్ లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం కథ తయారు చేసాడని చెప్తున్నారు. అయితే ఇదే పాయింటుతో ఆల్రెడీ మళయాళంలో మేజర్ రవి...అనే దర్శకుడు కాందహార్ అనే చిత్రం రూపొందించాడని..దానిని ఆధారం చేసుకుని ఈ కథనం అల్లాడని తమిళ చిత్ర పరిశ్రమలో వినపడుతోంది. కాందహార్ చిత్రంలో మోహన్ లాల్, అమితాబ్ బచ్చన్, సూర్య కీలకమైన పాత్రల్లో చేసారు. తమిళ,తెలుగు బాషల్లో రెడీ అయ్యే ఈ చిత్రం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఎయిర్ పోర్ట్ సెట్ వేస్తున్నారు. అలాగే నాగార్జున తన ఈ చిత్రం షూటింగ్ కోసం కేరళ బయలుదేరి వెళ్లారు. గురువారం నుంచి ఈ కొత్త చిత్రం షూటింగ్ అక్కడ మొదలైంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 'పయనం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మరో టైటిల్ గా 'వాంటెడ్' పేరు కూడా ప్రచారంలో ఉంది. కెప్టెన్ దేవి శరన్ రాసిన ఫ్లైట్ ఇంటూ ఫియర్ అనే పుస్తకం ఆధారంగా ఈ కథ తయారుచేయబడింది. ఈ పుస్తకం 1998లో టెర్రరిస్టులు కాందహార్ ప్లేన్ ని హైజాక్ చేయటం..తదితర పరిణామాలు ఆధారంగా రాసారు.