ఎన్టీఆర్..వినాయక్ సినిమాకు మళ్ళీ బ్రేక్?

వినాయక్ సొంతంగా ఒక కథనీ, దర్శక రచయిత దశరథ్ ఒక కథనీ రాసుకుని, ఆ రెండింటినీ మేళవించి మరో కథని తయారు చేశారు. దాన్ని ఇటీవల ఎన్టీఆర్కు వినిపించారు. విన్న వెంటనే 'అబ్బే ఏమీ బాగోలేదు వినయ్' అని చెప్పేశాడుట ఎన్టీఆర్. 'ఇలాంటి పాత కథలు వద్దు. నాకు కొత్తగా వుండాలి. ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను' అని స్పష్టం చేశాడని తెలుస్తోంది. దాంతో మళ్లీ కథల వంటకం మొదలుపెట్టారుట. కాబట్టి జూలై 10న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు లేవు. బహుశా ఈ నెలాఖరులోనో, ఆగస్టు తొలి వారంలోనో షూటింగ్ మొదలుకావచ్చు, అదీ కథ ఫైనలైజ్ అయితేనే! యేదైమైనా ఎన్టీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నాడు...కథా,కథనాలే పెద్ద హీరోలుగా చేస్తాయనే విషయాన్ని గ్రహించాడని శ్రేయాబిలాషులు,అభిమానులు అంటున్నారు. గాబట్టి ఆ వచ్చే ప్రొడక్టు పెద్ద హిట్టయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట.


Click it and Unblock the Notifications











