'ప్రేమమ్' తెలుగు రీమేక్: పరిణీతీ చోప్రా ని అడుగుతున్నాం
హైదరాబాద్: మళయాళీ బ్లాక్బస్టర్ చిత్రం ప్రేమమ్ రీమేక్లో బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్. ఈ చిత్రాన్ని తెరకెక్కించబోయే దర్శకుడు చందూ మొండేటి.ఇందులో నాగచైతన్య ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎస్.రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ఏడాది ఆఖరున చిత్ర షూటింగ్కు సన్నాహాలు జరుగుతున్నాయి.
దర్శకుడు చందు మెండేటి స్పందిస్తూ.. పరిణీతీతో చర్చలు జరుపుతున్నామని, ఆమె ఫరా ఖాన్ సినిమాతో బిజీగా ఉండడంతో డేట్లు కుదరట్లేదని, ఇప్పటికైతే ఏ విషయమూ కచ్చితంగా నిర్ధారించలేదని పేర్కొన్నారు. ఈ సినిమా కోసం దిషా పతానీ అనే మరో నటితో కూడా సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ మధ్యకాలం చిన్న బడ్జెట్ లో వచ్చి మళయాళంలో సూపర్ హిట్టైన చిత్రం 'ప్రేమమ్'. ఇదో ఫీల్గుడ్ లవ్స్టోరీ. చిన్న బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తారని తెలిసింది. కె.రాధాకృష్ణ నిర్మిస్తారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తారు. ఇటీవల చైతూ కూడా ఈ సినిమాని చూశాడట. తనకు బాగా నచ్చి రీమేక్కి పచ్చజెండా ఊపేశాడని చెప్పుకొంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
జార్జ్ అనే కుర్రాడు టీనేజ్ లో, కాలేజ్ లో , సెటిలేజ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వారి ప్రేమను సాధించుకోవటం లో ఊహించని అడ్డంకులు ఎదురై ,కలలు కరిగిపోయి ప్రేమించిన వారు మరొకరితో సెటిల్ అవ్వతుంటే తట్టుకోలేక గుండె పగిలేలా.. ఇలా కథ సాగుతుంది.
ఇక నివిన్ పౌలీ ఈ చిత్రంతో హీరో గా పరిచయమయ్యారు. ఆల్ఫోన్సే పూతరేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కింది. మే 29న విడుదలయిన ఈ చిత్రం పెద్ద హిట్టయ్యింది.
జూన్ నెలలో విడుదలైన ఈ 'ప్రేమమ్' చిత్రం టాక్ బాగుండటంతో ... విదేశాలలోనూ విడుదల చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా వసూళ్ళు యాభై కోట్లకు చేరుకున్నాయి. మళయాళ పరిశ్రమలో ఇలా లో బడ్జెట్ చిత్రం ఈ రేంజిలో హిట్ అయ్యి..ఇంత వసూలు చేయటం పెద్ద రికార్డు.
ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం తమిళ, కన్నడ భాషల నుండే కాకుండా హిందీ పరిశ్రమనుండీ మంచి డిమాండ్ ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications











