Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్రివిక్రమ్ తో కలిసే పవన్ కళ్యాణ్ నిర్మాణం
మొదట పవన్ కళ్యాణ్ ఒక్కడే ఈ పని చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ కూడా కలిసారు. ఇందుకోసం ఓ ఆఫీస్ ని జూబ్లీహిల్స్ లో నెలకొల్పాలని,ఆ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫస్ట్ ప్రొడక్షన్ కి సంభంధించిన ప్రకటన రానుందని తెలుస్తోంది. త్రివిక్రమ్..పవన్ చేస్తున్న ఈ పనికి పూర్తి స్ధాయి తోర్పాటు ఇస్తారని మాట ఇచ్చినట్లు చెప్తున్నారు.
ఇక వీరి కాంబినేషన్ లో రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె జరుగుతున్న నేపథ్యంలో విడుదల చేయడానికి నిర్మాతలు ఇష్టపడటం లేదు. డిస్ట్రిబ్యూటర్స్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె ముగిసే వరకు సినిమా విడుదల అయ్యే అవకాశం లేదని, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు సమ్మె ముగించి రోడ్డెక్కితే తప్ప సినిమా విడుదల కాదని అంటున్నారు.
సెప్టెంబర్ 21న ఆర్టీసీ బస్సులు సమ్మె బాట వదలి రోడ్డెక్కుతాయని సమాచారం. అదే జరిగితే సినిమాను సెప్టెంబర్ 26న విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అప్పుడు వీలు కాకపోతే అక్టోబర్ నెలలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలోనే విడుదల విషయమై ఓ క్లారిటీ రానుంది.
'అత్తారింటికి దారేది' చిత్రం సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.
ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో నటించింది. కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.