Don't Miss!
- News AP Pre-Poll Survey: ఏపీ ఎన్నికల్లో జనం పల్స్ క్లియర్ ! ఎన్ని సీట్లో తెలుసా ? లేటెస్ట్ సర్వే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
టెన్షన్ తగ్గించుకోవటానికే పవన్ ఆ నిర్ణయం?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మరో రీమేక్ కమిటయ్యాడని గత రెండు రోజులుగా మీడియాలో ఓ వార్త గుప్పు మంది. తమిళంలో అజిత్ హీరోగా వచ్చి హిట్టైన ‘వేదాళం' అది. అంతేనా ..ఈ రీమేక్ ని ఎన్టీఆర్ తో ‘రభస'చేసిన సంతోష్ శ్రీనివాస్ చేతిలో పెడుతున్నాడనీను. అయితే ఇది రూమర్ కాదు నిజమే అని పవన్ కు చెందిన కొందరు అంటున్నారు.
గతంలోనూ పవన్ రీమేక్ లు చేసి హిట్ కొట్టారు. దాంతో ఈ సారి మరో రీమేక్ అయితే కథ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదని పవన్ ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. తాజాగా చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ కోస ఆయన కలం పట్టి కథ,కథనం వండిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో రీమేక్ అయితే మన నేటివిటీ కు తగినట్లు మార్చుకుంటే సరిపోతుంది. అదీ సక్సెస్ ఫుల్ రీమేక్ అయితే దాదాపు అన్ని ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. అయితే పూర్తి నిర్ణయమైతే పవన్ తీసుకోలేదని అంటున్నారు.
అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వేదాళం'...మాస్, యాక్షన్, కుటుంబ బంధాలు కలగలిపిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకొంది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందా అని పవన్ ఆలోచిస్తున్నారు. ‘కందిరీగ'తో ఆకట్టుకొన్న సంతోష్పై నమ్మకంతో ఈ రీమేక్కి అతనికి అప్పగించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం మరికొద్ది రోజులు ఆగాలి.