twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌ రావడం వెనక చిరంజీవిపై కోపం ఉందట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వ‌రుణ్‌తేజ్, దిశాప‌టాని హీరో హీరోయిన్లుగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘లోఫ‌ర్' చిత్ర ఆడియో వేడుక డిసెంబ‌ర్ 7న జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు ప్ర‌భాస్ చీఫ్ గెస్ట్ గా హాజ‌రుకానున్నారట‌. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా వ‌స్తాడ‌ని అనుకున్నప్ప‌టికీ ప్రభాస్‌ను ఆహ్వానించాడు పూరి.

    150వ సినిమా అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి తనను కాదన్నందుకు పూరి కోపంగా ఉన్నారని.... ఆ కారణంగానే చిరంజీవిని పిలవడం ఇష్టం లేక ప్రభాస్‌ను చీఫ్ గెస్టుగా పిలిచాడనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ నుండి ఎవరినీ పిలవడం లేదు పూరి. అయితే ఈ చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసారు. చిరంజీవిగారు ఈ సినిమా కోసం వీడియో బైట్ ఇచ్చారని, దాన్ని ఆడియో వేడుకలో ప్రదర్శిస్తామని తెలిపారు.

     Prabhas Chief Guest for Varun Tej's Loafer'

    లోఫర్ చిత్రాన్ని 18 డిసెంబర్ న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు తేదీ ని లాక్ చేసినట్లు సమచారం. ఈ చిత్రంలో రేవతి, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ఇంటర్నెట్లో విశేష స్పందన లభిస్తోంది. వరుణ్‌ తేజ్‌ హీరోగా ఇటీవల విడుదలైన 'కంచె' చిత్రం బాక్సాఫీసు వద్ద డీసెంట్ హిట్టయింది. ఈ నేపథ్యంలో లోఫర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

    ఈ సినిమాకు లోఫర్ అని టైటిల్ పెట్టడంపై పూరి స్పందిస్తూ...కథలో భాగంగానే ఆ పేరు పెట్టాం. ఇందులో కథానాయకుడికి పనీ పాట ఏమీ ఉండదు. కానీ చివరికి మంచివాడిలా మారతాడు. ఈ పేరు ఎందుకు పెట్టామో సినిమా చూశాక బాగా అర్థమవుతుంది అని తెలిపారు.

    English summary
    Mega Prince Varun Tej's upcoming film 'Loafer's audio launch date has been locked to December 7. This mega event will be held at Shilpakalavedika of Hyderabad. Buzz that Young Rebel Star Prabhas will grace the event as a chief guest of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X