Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘రూలర్’ టైటిల్తో ఈసారి బోయపాటి...
ఇండస్ట్రీలో నెం.1 స్థానానికి ఎదగాలంటూ ముందు మాస్ ప్రేక్షకుల మెప్పించాలి. దీంతో ఆ కోవకి చెందిన దర్శకులతో చేయడానికి చెర్రీ ఇంట్రస్టు చూపుతున్నాడు.రామ్ చరణ్ కి దర్శకుడు బోయపాటి చెప్పిన కథ చాలా బాగా నచ్చిందనీ, తన అంగీకారాన్ని కూడా తెలియజేశాడని సమాచారం. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ కె.ఎల్ నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించనున్నారు.
దుర్గా ఆర్ట్స్ కె.ఎల్ నారాయణ ఈ విషయమై అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ... మేము రెండు భారీ చిత్రాలతో వస్తున్నాము. త్వరలోనే ఇవి సెట్స్ కు వెళ్లనున్నాయి. అవి... మహేష్-రాజమౌళి కాంబినేషన్ చిత్రం, బోయపాటి శ్రీను-రామ్ చరణ్ చిత్రం. ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయనున్నాం. వాటి వివరాలు తర్వాత ప్రకటిస్తాం అన్నారు.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై గతంలో క్షణ క్షణం, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, హలో బ్రదర్, సంతోషం, వంటి చిత్రాలు వచ్చి సూపర్ హిట్స్ అయ్యాయి. ఎన్టీఆర్ తో రాఖీ చిత్రం చేసిన తర్వాత వారు గ్యాప్ ఇచ్చారు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం యావరేజ్ అయ్యింది. ఆ తర్వాత వారు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ భారీ కాంబినేషన్ చిత్రాలు ప్రకటించారు.