Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘సారొచ్చారు’ కి రవితేజ కి రెమ్యునేషన్ ట్విస్టు అందుకే...
హైదరాబాద్ : రవితేజ తాజా చిత్రం 'సారొచ్చారు' ఆడియో ఎలాంటి హడావుడి, ఆడియో ఫంక్షన్ లేకుండా డైరెక్ట్ గా మార్కెట్లోకి రిలీజైన సంగతి తెలిసిందే. అంత పెద్ద బ్యానర్ లో అంత పెద్ద హీరో చిత్రంకి ఆడియో పంక్షన్ చేయకపోవటం ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంసమైంది. అయితే అలా పంక్షన్ చేయకపోవటానికి కారణమంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. రవితేజకు అశ్వనీదత్..రెమ్యునేషన్ విషయంలో ట్విస్ట్ ఇచ్చాడని, ఇంకా రెమ్యునేషన్ బ్యాలన్స్ ఉంచేసాడని, అందుకే రవితేజ తాను ఆడియో పంక్షన్ కి అటెండ్ కానని చెప్పడంటో హీరో లేకుండా ఆడియో పంక్షన్ ఎందుకని...ఇలా సైలెంట్ గా పంక్షన్ లేకుండా విడుదల చేసేసారని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. రవితేజ ఇమేజ్ కు తగిన విధంగా ఈచిత్రంలో దేవిశ్రీ మాస్ బీట్లతో పాటు, వినసొంపైన మొలోడీలను కంపోజ్ చేసాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేసారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గతంలో రవితేజ-పరశురామ్ కాంబినేషన్లో 'ఆంజనేయులు' అనే ప్లాపు మూవీ వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాత అశ్వినీదత్. ఈచిత్రాన్ని వైజయంతి మూవీస్ సమర్పణలో అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్ త్రీ ఏంజిల్స్ స్టూడియో ప్రై.లి.పై నిర్మిస్తున్నారు. మరో వైపు రవితేజ 'బలుపు' అనే చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. గోపీచంద్ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈచిత్రాన్ని త్రీ ఏంజిల్స్ స్టూడియో బేనర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె ప్రియాక దత్ నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన రవితేజ వరుస మూస సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోంది. సినిమాలో వినోదానికి అధిక ప్రాధాన్యత నిచ్చారు. అదే విధంగా నిర్మాణ విలువలు కూడా భారీగా ఉండనున్నాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.