షీలాపైనే 'పరుగు' నిందలు

నిజానికి 'దేశముదురు' తర్వాత విపరీతమైన స్టార్ డమ్ సంపాదించిన అల్లు అర్జున్ ప్రక్కన ఏ త్రిషానో , ఇలియానానో పెట్టుకోవచ్చు. కానీ సినిమాలో ఉండే అమాయకపు పల్లె పడుచు పాత్రకు షీలానే సూటవుతుందని భాస్కర్ భావించాడట. దాంతో మంచి ఆఫర్ వచ్చినందుకు ఆమె కూడా చాలా సంతోషపడింది. కాని సీను రివర్స్ అయింది. దాంతో ఆమె మెదటి నుంచి ఐరన్ లెగ్ అందుకే ఇలా జరిగింది అని ఆమె పైకి పరాజయాన్ని త్రోసే ప్రయత్నం చేస్తున్నారు సెంటిమెంట్లును విపరీతంగా నమ్మే సినిమా వారు.
కాని మరో వర్గం మాత్రం తెలుగు దర్శకులకు తప్పని రెండో సినిమా గండం భాస్కర్ దాటలేక పోయాడని కామెంట్లు చేస్తున్నారు. మొదటి సినిమా హిట్టు కిక్కు అతన్ని హేంగోవర్ లో ఉంచిందని అందుకే కథని తనిష్టమొచ్చినట్లు నడిపాడని అంటున్నారు. 'బొమ్మరిల్లు' లో తండ్రి కొడుకుల మద్య చోటు చేసుకునే కమ్యూనికెషన్ గ్యాప్ అనే సున్నితమైన అంశాన్ని చక్కని స్కీన్ ప్లే తో నడిపిన భాస్కర్ ఈ సినిమాలో అదే మిస్సయ్యాడని అంటున్నారు. అయినా ఈ సినిమా హిట్టయినా హోల్ అండ్ సోల్ గా అతనికే పేరొచ్చేలా కథని నడిపాడని, ఆఖరికి అల్లు అర్జన్ లో ఉన్న ఎనర్జీని, మాస్ ఇమేజ్ ని కూడా ప్రక్కన పెట్టాడని వారు వాదిస్తున్నారు. కాబట్టి షీలా కన్నా భాస్కర్ దే ఈ సినిమా పరాజయ భాద్యత అని డిసైడ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











