Just In
- 5 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 14 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 54 min ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
మహ్మద్ సిరాజ్కు నాతో చీవాట్లు తినడం ఇష్టం: టీమిండియా బౌలింగ్ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రానాకు హ్యాండిచ్చిన టబు.. కుదరని చెప్పేసిందా..?
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దగ్గుబాటి రానా తన కొత్త సినిమా 'విరాట పర్వం'. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో రానాకు జోడీగా ఫిదా భామ సాయి పల్లవి నటించనుంది. సురేష్బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్త సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
కాగా సీనియర్ నటి టబు 'విరాట పర్వం' సినిమాలో కీలక పాత్ర పోషించనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో మానవ హక్కుల పోరాట నాయకురాలిగా టబు పాత్ర ఉంటుందని అన్నారు. కానీ తాజాగా బయటకొచ్చిన సమాచారం మేరకు టబు ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె.. డేట్స్ కుదరకపోవడం కారణంగా రానా 'విరాట పర్వం' లో నటించనని చెప్పేసిందట. అయితే ఆమె స్థానంలో బాలీవుడ్ నటి నందితా దాస్ని కన్ఫర్మ్ చేసినట్లు టాక్.

చిత్రంలో రానా నక్సలైట్ పాత్ర పోషించనుండగా, సాయి పల్లవి జర్నలిస్ట్గా నటించనుందని తెలుస్తోంది. వృత్తిలో భాగంగా రానాను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సాయిపల్లవి.. అతనితో ప్రేమలో పడుతుందని, ఆ తర్వాత కొన్ని మలుపులు తిరిగి రానా జన జీవన స్రవంతిలోకి రావడం జరుగుతుందని అంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాల క్రిందటి పోటిటికల్ బ్యాక్ గ్రౌండ్లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. రానా, సాయి పల్లవి మొదటిసారి జోడీ కడుతున్న ఈ చిత్రం ఇద్దరి కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని చిత్రయూనిట్ చెబుతోంది.