25వ సినిమా కోసం జూ ఎన్టీఆర్ స్పెషల్ ప్లాన్?

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అత్తారింటికి దారేది' చిత్రం తర్వాత అల్లు అర్జున్తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్తో చేసే సినిమా మొదలు పెట్టనున్నాడు. దసరాకి ప్రారంభమై 2015 వేసవిలోగానీ, ఆ తర్వాతగానీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
రభస చిత్రం వివరాల్లోకి వెళితే...
జూ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న రభస(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు దశలో ఉంది. సమంత, ప్రణీత హీరోయిన్లు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











