పన్ను ఎగవేతపై స్పందించిన సోనుసూద్.. భావోద్వేగమైన లేఖ రాస్తూ..
కరోనా వైరస్ మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా బాధితులను ఆదుకొన్న సోనూసూద్పై పన్ను ఎగవేత ఆరోపణలను ఆదాయపు పన్ను అధికారులు చేయడం సంచలనం రేపింది. రెండు రోజుల క్రితం సోను సూద్ కార్యాలయాలు, నివాసాలు, ఆస్తులపై ఐటీ దాడుల నిర్వహించి ఆడిట్ పత్రాలను పరిశీలించడం తెలిసిందే. దీంతో సోనుసూద్పై రకరకాల కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో సోనుసూద్ భావోద్వేగంగా స్పందించారు. ఈ మేరకు లేఖ రాస్తూ...

ఆపదో ఉన్న ప్రతీ ఒక్కరిని..
కరోనావైరస్ కారణంగా దేశవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు ఏర్పడటంతో వలసవాదులను ఆదుకొన్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నారనే తెలియగానే స్వయంగా వారితో సంప్రదించి వారికి ఆర్థిక సహాయం అందించారు. ఎంతో మందికి ఆక్సిజన్ సిలండర్లు సరఫరా చేశారు. దాంతో దేశవ్యాప్తంగా సోనుసూద్కు ప్రజాదరణ దక్కింది. సోనుసూద్ అందించిన సేవలపై ప్రశంసల వర్షం కురిపించారు.

20 కోట్ల మేర లెక్కతేలని నిధులు
సోనుసూద్ నివాసాలు, కార్యాలయాలు దాడుల అనంతరం దాదాపు 20 కోట్ల మేర అవకతకలు జరిగాయని, ఆ మొత్తానికి పన్ను ఎగవేతకు పాల్పడ్డారని అదికారులు తేల్చారు. సోను సూద్కు సంబంధమున్న లక్నో ఆధారిత కంపెనీపై కూడా ఆదాయపు పన్ను అధికారులు దాడి చేశారు. ఈ క్రమంలో లెక్కతేలని రుణాలను గుర్తించారు. విదేశాల నుంచి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు ఉల్లంఘిస్తూ డొనేషన్లు సేకరించారని ఆరోపణలు వచ్చాయి.

ప్రతీ రూపాయికి లెక్క ఉందని
నా ఫౌండేషన్ లెక్కలను ప్రతీ ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. అవసరమైన మేరకు అధికారులకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆపద సమయంలో బాధితుల ప్రాణాలను కాపాడటానికి ఖర్చు చేసిన ప్రతీ రూపాయికి లెక్క ఉంది. తాను బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసే కంపెనీలను తన ఫీజులను ఛారిటీలకు చెల్లించాలని కోరాను అని సోనుసూద్ తెలిపారు.

మళ్లీ సేవలకు సిద్ధం అంటూ
ఐటీ దాడులు, తనిఖీల కారణంగా నాలుగు రోజులుగా తనిఖీలు, గెస్టులు రావడం కారణంగా బాధితులకు సహాయం అందించలేకపోతున్నాను. ఇక ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ఎప్పటిలానే బాధితులకు అండగా నిలిచే సేవకు సిద్ధమవుతున్నాను అని సోనుసూద్ పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇక ముందు నా సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మంచి చేయాలి.. మంచిగా ఉండాలి. చివరకు మంచి కోసం మంచి జరగాలి అని హిందీలో ఓ స్టేట్మెంట్ను ట్విట్టర్ పోస్ట్ చేశారు.
Recommended Video
చిరంజీవితో ఆచార్య చిత్రంలో
సోనుసూద్ కెరీర్ విషయానికి వస్తే.. లాక్ డౌన్ తర్వాత అల్లుడు అదుర్స్ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. ప్రస్తుతం చిరంజీవితో కలిసి సొనుసూద్ ఆచార్య, బాలీవుడ్ చిత్రం పృథ్వీరాజ్, కోలీవుడ్లో తమిలారాసన్ చిత్రాల్లో నటిస్తున్నారు. సినిమాల్లో నటిస్తూనే ప్రజాసేవలో మునిగిపోతున్నారు. ఇక సోనుసూద్ రాసిన లెటర్ పూర్తి సారాంశం ఇదే..


Click it and Unblock the Notifications











