Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఘోర రోడ్డు ప్రమాదంలో యువ హీరోయిన్ మృతి.. బాయ్ఫ్రెండ్తో సహా గోవాలో కన్నుమూత
బాలీవుడ్, మరాఠీ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మరాఠీ చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ప్రేక్షకులను మెప్పిస్తూ వర్థమాన తారగా గుర్తింపు పొందుతున్న ఈశ్వరీ దేశ్పాండే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దీంతో సినీ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. గోవాకు సమీపంలో జరిగిన ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రియుడితో కలిసి గోవాకు వెళ్తూ..
ఈశ్వరీ దేశ్పాండే తన కాబోయే భర్త, ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లారు. బుధవారం ఉదయం సుమారు 5.30 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. దాంతో వారు ప్రయాణిస్తున్న కారు బాగా క్రీక్ వద్ద ఉన్న జలాశయంలో మునిగిపోయింది. దాంతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ దుర్ఘటన బద్దేజ్ తాలుకాలోని హడ్ఫేడ్ గ్రామంలోని అర్పోవా వద్ద చోటు చేసుకొన్నది. కారు సెంట్రల్ లాక్ కావడంతో వారిద్దరిని కాపాడటానికి వీలుకాకపోవడంతో కారుతో సహా వారిద్దరూ నీట మునిగి మరణించారు అని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
Krithi Shetty :అందాల కృతి పుట్టిన రోజు వేడుకలు.. టాలీవుడ్ నయా 'క్వీన్' సెలబ్రేషన్స్!
కాలువలో కారు మునిగిపోవడంతో
మీడియా వెల్లడించిన కథనం ప్రకారం.. ఈశ్వరీ దేశ్పాండే తన ప్రియుడు శుభమ్ దండ్గేతో కలిసి వాహనంలో ప్రయాణిస్తున్నారు. గోవాలోని బద్దేజ్ తాలుకాలోని అర్పోవా గ్రమా వద్ద ప్రమాదం చోటుచేసుకొన్నది. బాగా కాలువలో పడి కారు మునిగిపోయింది. దాంతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. వీరిద్దరు వచ్చే నెల నిశ్చితార్థం జరుపుకోబోతున్నారు. ఇంతలోనే విషాదం వారిని వెంటాడింది అని కథనంలోపేర్కొన్నారు.
కారుపై డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో
పోలీసుల వెల్లడించిన కథనం ప్రకారం.. ఈశ్వరీ దేశ్ పాండే వేగంగా ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. కారుపై డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో ప్రమాదానికి గురైంది. కారు వేగంతో ఉండటం వల్ల అపోజిట్ రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. కాలువలో మునిగిపోయిన కారును అగ్నిమాపక దళం సహాయంతో బయటకు తీశాం. ఆ ఇద్దరి దేహాలను పోస్టు మార్టమ్కు పంపించాం. ఈ దుర్ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిస్తున్నాం అని అంజునా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సూరజ్ గవాస్ తెలిపారు.
Recommended Video
మృత్యువు వెంటాడటంతో ...
ఈశ్వరీ దేశ్ పాండే నటించిన చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ క్రమంలోనే ఆమెను మృత్యువు వెంటాడింది. మరాఠి సినీ దర్శకుడు సునీల్ చౌతమాల్ రూపొందించిన ప్రేమాచే సైడ్ ఎఫెక్ట్ అనే చిత్రం ద్వారా ఈశ్వరీ దేశ్పాండే సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె మృతిపై సహ నటుడు అభయ్ బెర్డే తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈశ్వరీ ఇంకా హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. ఈశ్వరీ దేశ్ పాండే పూణెకు చెందిన వారు.