Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Bigg Bossలో అనాగరిక చర్య, కంటెస్టెంట్ సూసైడ్ చేసుకొనేంతగా అవమానం.. నాగార్జునను టార్గెట్ చేస్తూ మాధవీలత పోస్ట్
టాలీవుడ్ నటి మాధవి లత మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. చాలా విషయాలపై కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే మాధవీలత సోషల్ మీడియాలో షాకింగ్ పోస్టు పెట్టారు. దాంతో అందరి దృష్టి ఇప్పుడు ఆమె చేసిన బిగ్బాస్ తెలుగు షోపై పడింది. అయితే బిగ్బాస్ తెలుగు షో గురించి ఆమె చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ఇంతకు మాధవి లత పెట్టిన పోస్టు ఏమిటంటే..
మీటూ ఉద్యమం సమయంలో
మాధవీలత విషయానికి వస్తే గతంలో మీటూ ఉద్యమంలో పలువురు టాప్ హీరోలు, దర్శకులపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. తెలుగు అమ్మాయిలంటే ఇండస్ట్రీలోని నిర్మాతలు, హీరోలకు చులకన అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఏకంగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోపై కూడా హాట్ వ్యాఖ్యలు చేసింది.
రాజకీయాల్లో చేరిన అందాల తార
టాలీవుడ్లో అందం, అభినయంతో ఆకట్టుకొనే హీరోయిన్లలో ఒకరైన మాధవీలతకు ఊహించినంతగా అవకాశాలు రాకపోవడంతో సినీ కెరీర్ అంతగా ఊపందుకోలేకపోయింది. దాంతో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేపీలో చేరిన ఆమె కొందరు రాజకీయ నేతలపై కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీజేపీకి దూరంగా లేను. ఆ పార్టీలో సైలెంట్గా ఉన్నాను అంటూ మాధవీలత కౌంటర్ ఇచ్చింది.
బిగ్బాస్లో అనాగరిక చర్య
ఇక బిగ్బాస్ తెలుగు 5 షోలో తాజా ఎపిసోడ్పై మాధవీలత షాకింగ్ కామెంట్లు చేసింది. సోషల్ మీడియాలో పెట్టిన ఆమె పోస్టు ప్రకారం.. బిగ్బాస్ హౌస్లో ఒక అనాగరిక చర్యకి పాల్పడిన సంఘటన ఒకటి నా దృష్టికి వచ్చింది. దానిపై మానవ హక్కులు, ప్రజా సంఘాలు ఎలాగు స్పందించవు అని తన పోస్టులో మాధవీలత పేర్కొన్నారు.
ఒక మనిషి సూసైడ్ చేసుకొనేంతగా అవమానం
మాధవీలత తన పోస్టులో మరింతగా స్పందిస్తూ.. నాగరిక సమాజంలో బతుకుతూ.. ఒక మనిషిని సూసైడ్ చేసుకొనే స్థాయిలో బిగ్బాస్ టీమ్, మిస్టర్ నాగార్జున అవమానించారు. అదే పని నాగార్జునకు ప్రజలు చేస్తే ఎలా ఉంటుందో. ఒకవేళ అలా చేస్తే మరుసటి రోజు 100 శాతం కనపించకుండా పోతారు. ఈ రోజు సాయంత్రం ఆ అనాగరిక చర్య వివరాలను పోస్టు చేస్తాను అని హీరోయిన్ మాధవీలత ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
సూసైడ్ చేసుకొనేంతగా ఎవరు వేధించారు?
అయితే మాధవీలత చెప్పిన అనాగరిక చర్య ఏమిటి? ఎవరిని సూసైడ్ చేసుకొనేంతగా వేధించారు? బిగ్బాస్ ఇంటిలో జరిగిన విషయాలు ఏమిటి? అనే విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మాధవీలత పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఆమె పెట్టే తదుపరి పోస్టు కోసం, ఆమె ఏం రివీల్ చేస్తుందనే విషయంపై నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.