Kiara Advani ప్రియుడి ఇంట్లో పట్టుబడ్డ బాలీవుడ్ భామ.. అలాంటి రూమర్లలోకి దూరిన ప్రముఖ దర్శకుడు!
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ జీవితం రాకెట్లా రివ్వున దూసుకెళ్తున్నది. అయితే ప్రియుడితో విభేదాలు తలెత్తాయని, అందుచేత వారిద్దరూ విడిపోయారనే వార్తల ఓ వైపు మీడియాలో ప్రచారం అవుతుండగా.. ఏకంగా ప్రియుడి ఇంట్లో దూరుతూ కెమెరామెన్లకు కంటపడటం ముంబై మీడియాలో వైరల్ అయింది. అయితే ప్రియుడితో నెలకొన్న విభేదాలను పరిష్కరించడంలో ఓ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చొరవ చూపారని, దాంతో వారిద్దరి మధ్య సయోధ్య కుదిరిందనే ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ఆ దర్శకుడు ఎవరు? కియారా అద్వానీ పర్సనల్, ప్రొషెషనల్ విషయాల్లోకి వెళితే..

8 ఏళ్ల కెరీర్తో కియారా
కియారా అద్వానీ హిందీ చిత్ర రంగంలోకి అడుగుపెట్టి మంచి విజయాలను అందుకొన్నది. తెలుగుతోపాలు పలు భాషల్లో నటిస్తూ ఆకట్టుకొంటున్నారు. కియారా అద్వానీ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 8 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల తన సన్నిహితులు, స్నేహితులతో కలిసి భారీ పార్టీని కూడా చేసుకొన్నారు.

కియారా సక్సెస్ జోరు..
అలాగే కియారా అద్వానీ నటించిన భూల్ భులయ్యా చిత్రం అటు సినీ విమర్శకులను మెప్పించడమే కాకుండా కమర్షియల్గా కూడా భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ చిత్రం 200 కోట్ల కలెక్షన్లను నమోదు చేసి హిందీ సినిమా పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ఘనతను సొంతం చేసుకొన్నది.

జగ్ జగ్ జియో ప్రమోషన్లలో
ఇక కియారా అద్వానీ వరుస ప్రాజక్టులతో తన కెరీర్ను భారీగా ప్లాన్ చేసుకొంటున్నది. ప్రస్తుతం బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్తో కలిసి జగ్ జగ్ జీయో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సినిమాపై క్రేజ్ను పెంచుతున్నారు. వరుణ్ ధావన్తో కలిసి ప్రమోషన్లో పాల్గొంటున్నారు.

దుపట్టా సాంగ్లో ఘాటైన రొమాన్స్
జగ్ జగ్ జీయో చిత్రంలో వరుణ్ ధావన్తో కలిసి ఘాటు ఘాటుగా నటించింది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ హైలెట్గా మారుతున్నది. ఈ చిత్రంలోని దుపట్టా సాంగ్లో వారిద్దరు నటించిన శృంగార సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వారి మధ్య హాట్ కెమిస్ట్రీ యూత్ను సినిమా థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నది.

సిద్దార్థ్తో విడిపోయారంటూ రూమర్లు
ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. సిద్దార్థ్ మల్హోత్రాతో కొన్నేళ్లుగా డేటింగ్తోపాటు సహజీవనం చేస్తున్నారు. అయితే వారిద్దరూ వ్యక్తిగత విభేదాల కారణంగా విడిపోయారు. అయితే ఎవరి జీవితాన్ని వారు గడుపుదామని నిర్ణయించుకొన్నారు. వారిద్దరి మధ్య పరిష్కరించుకొలేనంతగా విభేదాలు నెలకొన్నాయి అనే వార్తలు బాలీవుడ్ మీడియాలో కనిపించాయి.

సిద్దార్థ్తో కలిసి ప్రీమియర్ షోకు
అయితే ఇలాంటి రూమర్ల మధ్య అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. కియారా, సిద్దార్థ్ మల్హోత్రా ఇద్దరూ భూల్ భులయ్యా సినిమా ప్రీమియర్కు చేతిలో చేయి వేసుకొని రావడం మీడియాను ఆకట్టుకొన్నది. అయితే కియారా, సిద్దార్థ్కు సన్నిహితంగా ఉండే ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ వారిద్దరి మధ్య విభేదాలను పరిష్కరించారట. దాంతో వారిద్దరూ మళ్లీ కలిసిపోయారు అని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.

సిద్దార్థ్ ఇంటిలో పట్టుబడ్డ కియారా
తాజా ముంబైలో సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంట పక్షులుగా మారిపోయారు. సిద్దార్థ్ నివాసంలోకి వెళ్తూ మీడియా కంటపడ్డారు. దాంతో వారిద్దరి మధ్య సయోధ్య కుదిరింది. వారిద్దరూ జోరుగా రొమాన్స్లో మునిగిపోయారని బాలీవుడ్ పత్రికలు కోడైకూస్తున్నాయి.


Click it and Unblock the Notifications











