Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ కాంబినేషన్ చూసి టెంప్ట్ అయిన కీర్తి సురేష్.. యాక్షన్ హీరోకు గ్రీన్ సిగ్నల్
మహానటి సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న బ్యూటీ కీర్తి సురేష్. ఆ సినిమా హిట్టయిన తరువాత ఈ బ్యూటీ మళ్ళీ తెలుగులో హీరోయిన్ గా కనిపించలేదు. ఆ మధ్య మన్మథుడు సినిమాలో ఎదో చిన్న గెస్ట్ రోల్ చేసిందంతే. ఇక మిస్ ఇండియా, రంగ్ దే సినిమాలు ఈపాటికె రిలీజ్ కాచాల్సింది. కానీ లక్ డౌన్ వల్ల అవి వాయిదా పడక తప్పలేదు.
ఇక చాలా రోజుల తరువాత కీర్తి సురేష్ ఒక తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు తమిళ్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే యాక్షన్ హీరో గోపిచంద్ తో దర్శకుడు తేజ 'అలిమేలు మంగ వెంకటరమణ' అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఆ సినిమా హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాజల్ అగర్వాల్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యిందని కథనలు వచ్చాయి కానీ అవి రూమర్స్ అని తెలిపోయాయి.
ఇక ఫైనల్ గా తేజ, గోపిచంద్ కాంబినేషన్ పై మహానటి ఇంట్రెస్ట్ చూపించి సింగిల్ సిట్టింగ్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సినిమాలో హీరోతో సమానమైన హీరోయిన్ రోల్ కావడంతో రెమ్యునరేషన్ కొంచెం తక్కువైనా కూడా అభ్యంతరం చెప్పలేదట.
జయం, నిజం సినిమాల్లో గోపిని విలన్ గా చూపించిన తేజ దాదాపు 17 ఏళ్ళ తరువాత మళ్ళీ అతనితో వర్క్ చేస్తున్నాడు. విలన్ గా చాలా పవర్ఫుల్ పాత్రల్లో చూపించి గోపిచంద్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన తేజ ఇప్పుడు అంతకంటే పవర్ఫుల్ హోరోగా ప్రజెంట్ చేయనున్నాడట. అందుకే కీర్తి సురేష్ సినిమా చేయడానికి ఒప్పుకుందని తెలుస్తోంది.