Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే హీరోయిన్ దూకుడు: కుర్రాళ్లతో పాటు సీనియర్ హీరోతోనూ!
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉప్పెన' ద్వారా మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. ఈ సినిమాతోనే కృతీ శెట్టి కూడా హీరోయిన్గా పరిచయం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. ఈ మూవీ పోస్టర్, టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే అందరూ ఈమె గురించి చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా యూత్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కృతీ శెట్టి వరుస ఆఫర్లను దక్కించుకుంటూ తన సత్తాను నిరూపించుకుంటోంది.
లవర్ నాగశౌర్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్గా చేస్తోందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలోనూ ఆమె హీరోయిన్గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అమ్మడు గురించే రెండు ఇండస్ట్రీల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్.. సురేందర్ రెడ్డి కలయికలో రూపొందనున్న చిత్రంలోనూ కృతీ శెట్టి హీరోయిన్గా నటించబోతుందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
ఇటీవలే జరిగిన 'ఉప్పెన' ప్రీ రిలీజ్ ఈవెంట్లో 'ఈ అమ్మాయిని త్వరగా బుక్ చేసుకోండి. కొద్ది రోజులైతే డేట్స్ దొరకడం కష్టమే' అంటూ కృతి శెట్టిని ఉద్దేశించిన మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆమె అప్పుడే వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇదిలా ఉండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన 'ఉప్పెన'లో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రలో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కింది. ఇది ఫిబ్రవరి 12న విడుదల కాబోతుంది.