నటిగా ఎంట్రీ ఇవ్వబోతున్న పూరి జగన్నాథ్ కుమార్తె!
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమార్తె పవిత్ర నటిగా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్నాడు. కానీ పూరి జగన్నాథ్ కుమార్తె పవిత్ర హీరోయిన్ గా కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రంలో పవిత్ర కోసం ఓ మంచి పాత్రని సిద్ధం చేశారట. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అని అంటున్నారు. ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ చివరగా తెరకెక్కించిన చిత్రం మెహబూబా నిరాశపరిచింది.

తదుపరి చిత్రంలో ఎలాగైనా హిట్ కొట్టాలని పూరి భావిస్తున్నాడు. మెహబూబా చిత్రంలో పూరి తనయుడి ఆకాష్ హీరోగా నటించాడు. పూరి కుమార్తె పవిత్ర పెద్ద మీడియా ముందు కనిపించలేదు.


Click it and Unblock the Notifications











