Just In
- just now
KGF స్టమక్ పంచ్ మామూలుగా లేదు.. బాహుబలి, RRR సినిమాపై RGV సెటైర్..
- 1 hr ago
క్రాక్ సినిమాకు రవితేజ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.. కానీ ఇప్పుడు అంతకుమించి!
- 2 hrs ago
చివరి నిమిషంలో లెక్కలు మార్చిన వకీల్ సాబ్.. ఒక్కసారిగా పెరిగిన రేటు.. మంచి లాభమే!
- 3 hrs ago
బాక్సాఫీస్ ఫైట్: అల్లుడు అదుర్స్ vs రెడ్.. థియేటర్స్ కోసం గొడవలు.. చివరికి ఎంత రాబట్టారంటే?
Don't Miss!
- News
స్వదేశీ కోవాగ్జిన్ కంటే..విదేశీ కోవిషీల్డ్ వైపే మోడీ సర్కార్ మొగ్గు: ఎందుకిలా? బఫర్ స్టాక్గా
- Sports
India vs Australia: గాయంతో సైనీ ఔట్.. బౌలింగ్ చేసిన రోహిత్ శర్మ వీడియో
- Finance
ఫిబ్రవరి 1న 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల
- Lifestyle
Army Day 2021 : ‘సరిలేరు మీకెవ్వరు’ ఇవి తెలిస్తే.. సైనికులకు సలాం కొట్టకుండా ఉండలేరు...!
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలీవుడ్లో రష్మిక మందన్న డెడ్లీ ఎంట్రీ.. మెగాస్టార్తో కలిసి గ్రాండ్గా..
దక్షిణాదిలో సత్తా చాటుతున్న రష్మిక మందన్న బాలీవుడ్లో గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఒక ఆఫర్ను చేజిక్కించుకొన్న ఈ కన్నడ భామ మరో బిగ్ ఆఫర్ను అందుకొన్నట్టు సమాచారం. ఈ క్రమంలో రష్మిక మందన్న బాలీవుడ్ కెరీర్ గురించి...

కన్నడ నుంచి టాలీవుడ్లోకి
కన్నడ నుంచి తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న వరుస విజయాలను అందుకోవడమే కాకుండా అగ్ర హీరోలకు లక్కీ మస్కట్గా మారారు. పలు స్టార్ హీరోలతో క్రేజీ ప్రాజెక్టులను చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలను చేస్తూనే హిందీలోకి అడుగుపెట్టారు.

డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ గురించి
డియర్ కామ్రెడ్ చిత్రం తర్వాత బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్లో నటించమని ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే లాక్డౌన్ తర్వాత రష్మిక చూపు బాలీవుడ్లో పడింది.

మిషన్ మజ్నులో రష్మిక హీరోయిన్గా
ప్రస్తుతం బాలీవుడ్ హీరో 'సిద్ధార్థ్ మల్హోత్రాతో జతకట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత రోని స్కూృవాలా నేతృత్వంలో గల్టీ, ఆర్ఎస్వీపీ బ్యానర్లపై రూపొందుతున్న మిషన్ మజ్ను చిత్రంలో రష్మిక నటిస్తున్నారు. ఈ చిత్రానికి యాడ్ ఫిల్మ్ మేకర్ శంతను బగ్చీ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. మిషన్ మజ్ను చిత్రం ఇండియా, పాకిస్థాన్ సరిహద్దులో 1970లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్నది. సిద్దార్థ్ మల్హోత్రా ఈ చిత్రంలో రా ఏజెంట్గా నటిస్తున్నారు.

అమితాబ్ బచ్చన్తో డెడ్లీ చిత్రంలో
ఇదే ఊపులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్తో కలిసి నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నారు. డెడ్లీ అనే టైటిల్తో సెట్స్పైకి వెళ్లే చిత్రంలో లీడ్ హీరోయిన్గా నటిస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. త్వరలోనే రష్మిక రెండో హిందీ సినిమా గురించి అధికారికంగా ప్రకటన వెలువడనున్నది.

2021లో రష్మిక మందన్న కెరీర్
హిందీలో రెండు ప్రాజెక్టులతోపాటు ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప చిత్రంలోను, అలాగే తమిళంలో కార్తీ నటించిన సుల్తాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక కన్నడలో రూపొందిన పొగరు చిత్రంలో కూడా హీరోయిన్ నటిస్తున్నారు. ఇలా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కన్నడ భామ హిందీలోకి కూడా అడుగుపెట్టింది.