Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సాయి పల్లవి మరో షాకింగ్ నిర్ణయం.. ఆమె ఒప్పుకుందంటే బలమైన కారణం ఉండే ఉంటుంది
గ్లామరస్ బ్యూటీస్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయితే టాలంటేడ్ కథానాయికలు మాత్రం కొందరు మాత్రమే ఉన్నారని చెప్పవచ్చు. అలాంటి నటిమణుల్లో సాయి పల్లవి ఒకరు. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక కొత్త తరహా పాయింట్ ఉంటుంది. ఇక ఇటీవల మరొక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్ వస్తుండడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఆమె టాలెంట్ కు తగ్గట్లుగానే..
సాయి పల్లవి ఎలాంటి పాత్ర చేసిన కూడా కథలో తన పాత్ర చాలా బలంగా ఉండాలని కోరుకుంటుంది. దర్శకులు కూడా ఆమె టాలెంట్ కు తగ్గట్లుగానే పాత్రలను డిజైన్ చేస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి హీరోలతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఈ మలయాళీ అమ్మాయి ఇటీవల ఒక కొత్త సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.
రెమ్యునరేషన్ ఎక్కువగా ఇస్తే..
సాధారణంగా ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ వీలైనంత వరకు సక్సెస్ లో ఉన్న వారితోనే సినిమాలు చేయడానికి ఇష్టపడతారు. అయితే కొన్నిసార్లు రెమ్యునరేషన్ ఎక్కువగా ఇస్తే ఒప్పేసుకుంటారు కూడా. కానీ సాయి పల్లవి రెమ్యునరేషన్ లాంటి విషయాలను ఎంత మాత్రం పట్టించుకోదని అందరికి తెలిసిన విషయమే.
ఆ రైటర్ కు గ్రీన్ సిగ్నల్
ఆమె కోసం ఎవరైనా వేయిట్ చేయాల్సిందే గాని. సాయి పల్లవి ఎవరి కోసం వేయిట్ చేయదని ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. ఇక ఇటీవల ఫామ్ లో లేని రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ సాయి పల్లవికి ఒక కథ చెప్పగా ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. కిక్, రేసుగుర్రం, టెంపర్ వంటి హిట్ సినిమాలకు కథ అందించిన వంశీ నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ఆమె ఒప్పుకుందంటే..
వంశీ మొదటి డైరెక్షన్ లో ప్లాప్ అందుకోగానే ఎవరికి కథ చెప్పినా కూడా రెండవ ఛాన్స్ ఇవ్వలేదు. చివరికి హీరోగా నితిన్ ఒప్పుకున్నప్పటికి కథలో పాత్రపై అనుమానాలతో కొంతమంది హీరోయిన్స్ ఒప్పుకోలేదట. కానీ సాయి పల్లవి మాత్రం సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసినట్లు సమాచారం. ఆమె ఒప్పుకుందని అంటే తప్పకుండా వక్కంతం వంశీ కొత్త ప్రయోగం ఎదో చేయబోతున్నట్లు చెప్పవచ్చు..