Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రతీకారం తీర్చుకొనే ‘ఒక్క వీరుడు’ వస్తున్నాడు..
జాసన్ మమో, రేచల్ నిఖోల్ ముఖ్యతారలుగా హాలీవుడ్ లో రూపొందిన 'కొనాన్ ది బార్బేరియన్" చిత్రం ఈ నెలాఖరుకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మార్కస్ నిస్పెట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ 'ఒక్క వీరుడు"ను హీరా ఫిలింస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా హీరా ఫిలింస్ అధినేత శరద్ జోషి మాట్లాడుతూ 'ఊహ కూడా తెలియని వయసులో తన తండ్రిని అత్యంత కిరాతంగా చంపడమే కాకుండా.. తమ గ్రామాన్ని నామరూపాల్లేకుండా చేసి, తమ తెగకు చెందినవారందర్నీ తెగనరికి చంపినవారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడనేది ఈ చిత్ర కథాంశం. హీరోని నేరుగా ఎదుర్కోలేక విలన్లు తాంత్రిక శక్తులను ఉపయోగించినప్పుడు హీరో ఆ శక్తుల్ని ఎలా ఎదుర్కొన్నాడనేది ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. 400 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మాణమైన ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. తప్పకుండా చిత్రం విజయవంతమవుతుందనే నమ్మకం వుంది" అన్నారు.