జయంతి మనవడు కూడా స్టార్ హీరోనే తెలుసా... ఎవరంటే?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి జయంతి కన్నుమూశారు. జయంతి వయసు 76 సంవత్సరాలు. వయసు సంబంధిత సమస్యల కారణంగా ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం బెంగళూరులో ఆయన తుది శ్వాస విడిచారు. ఆమె మనవడు కూడా ఒక స్టార్ హీరో. ఆయన ఎవరు అనే వివరాల్లోకి వెళితే

వందలాది సినిమాల్లో
నటి జయంతి వందలాది సినిమాల్లో నటించారు. ఆమె ఐదు భాషల్లో, ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమలో పనిచేశారు. జయంతి కుమారుడు కృష్ణ కుమార్ బెంగళూరులో ఆమె మరణ వార్త ధృవీకరించారు మరియు ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో ఉందని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతోంది భావిస్తున్న క్రమంలో సోమవారం నిద్రలో మరణించారని వెల్లడించారు.

అప్పుడే చనిపోయిందని
2018 సంవత్సరంలో, జయంతి మరణం గురించి ఒక పుకారు వచ్చింది, అప్పుడు ఆమె ముందుకు వచ్చి స్పష్టత ఇచ్చింది. జయంతి 6 జనవరి 1945 న కర్ణాటకలో జన్మించారు. బాల నటిగా కెరీర్ ప్రారంభించిన జయంతి నటన విషయంలో కాక ప్రొడ్యూసర్ గా కూడా కొన్ని సినిమాలు చేశారు.

బడా స్టార్లతో నటన
60 నుంచి 80 వరకు అత్యంత అందమైన మరియు ఉత్తమ నటీమణులలో ఒకరిగా పరిగణింపబడిన జయంతి, జెమిని గణేషన్, ఎంజీఆర్, ఎన్టీఆర్ మరియు జయలలిత వంటి పెద్ద తారలతో కలిసి పనిచేశారు. ఆమె హిందీ చిత్రాలలో కూడా పనిచేశారు. జయంతి మూడు బాలీవుడ్ చిత్రాలు టీన్ బహురాణి, తుమ్ సే అచ్చా కౌన్ హై మరియు గుండా అనే సినిమాల్లో నటించారు.

అనేక రివార్డులు
ఆమె ఉత్తమ నటన జాబితాలో చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి, వాటిలో స్వాతి కిరణం, కొండవీటి సింఘం, జస్టిస్ చౌదరి మరియు పెదరాయుడు వంటి చిత్రాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాన్ని ఏడుసార్లు గెలుచుకున్న ఏకైక నటి జయంతి. ఇది కాకుండా ఆమెకు రెండు సార్లు ఫిలింఫేర్ అవార్డులు కూడా లభించాయి.

దూరపు బంధమే కానీ
ఇక జయంతి మనవడు తమిళంలో స్టార్ హీరోగా ఉన్నాడు. అతడే జీన్స్ మూవీలో హీరోగా చేసిన ప్రశాంత్. ఒకప్పుడు తమిళ సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఆయన ఇటీవల రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ మూవీలో కూడా నటించారు. నిజానికి జయంతి భర్త నటుడు పేకేటి శివరాం. జయంతి ఆయనకు రెండవ భార్య. ఆయన మొదటి భార్యకు ముగ్గురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. అలా ఆమె మొదటి భర్త రెండో కొడుకు, నటుడు, దర్శకుడు త్యాగరాజన్ కుమారుడు ఈ ప్రశాంత్. కనుక హీరో ప్రశాంత్ జయంతికి మనవడు అవుతాడు.


Click it and Unblock the Notifications











