Don't Miss!
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్లో రోలర్తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్పూర్..
- Technology
భారత్లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
సర్కారు వారి పాట దెబ్బ.. త్రివిక్రమ్ సినిమాకు అతను వద్దంటున్న మహేష్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ఎలాగైనా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే చాలా ఏరియాలో సినిమాకు పెట్టిన పెట్టుబడిలో కొంత నష్టాలు కలిగినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో అయితే సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ను పూర్తి చేయలేదు.
ఒక విధంగా మహేష్ బాబు ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్ అలాగే సినిమాలో అతని స్టార్ ఇమేజ్ జనాలను థియేటర్స్ కు రప్పించాయాని చెప్పవచ్చు. అయితే సర్కారు వారి పాట సినిమా విషయంలో మహేష్ బాబు ఎందుకు ఫ్లాప్ అయిందని అంశాలను కూడా మరోసారి చర్చిల్లోకి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా ఈ సినిమాకు మ్యూజిక్ బాగానే ఉపయోగపడినప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అయితే థమన్ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి.

ఇక ఆ విషయంలో కూడా మహేష్ బాబు మరొకసారి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ చేయబోయే సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ ముందే సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే SSMB28 సినిమాకు మళ్ళీ థమన్ పనిచేయడం ప్రేక్షకులకు కాస్త బోరింగ్ అనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు అతను వద్దని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మహేష్ బాబు కూడా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మరోసారి త్రివిక్రమ్ తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కొనసాగుతున్న అనిరుద్ రవిచంద్రన్ అయితే బెటర్ గా ఉంటుంది అని మహేష్ బాబు ఆలోచిస్తున్నాడట. అయితే ఇది వరకే త్రివిక్రమ్ తో అనిరుద్ అజ్ఞాతవాసి సినిమాకు పని చేశాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ అరవింద సమేతజూ కూడా సంగీతం ఇవ్వాల్సింది. కానీ ఆ తర్వాత ఎందుకు అతను డ్రాప్ అయ్యాడు. మరి ఇప్పుడు మహేష్ ఆలోచన మేరకు అతనిని తీసుకు వస్తారో లేదో చూడాలి.