షూటింగ్ లో పేకాడుకుంటూ కూర్చుంటే ...దాసరి వార్నింగ్

అయినా దాసరికి 'మా'కీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ సంఘం ఆవిర్భావానికి కారకుడిని నేను'' అన్నారు. 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ ''పరభాషా నటులు చాలా మంది ఈ సంఘంలో సభ్యులు కావడంలేదు. వారందరికీ సభ్యత్వం తీసుకోమని చెబుతున్నాం. పేద కళాకారుల్ని ఆదుకొనేందుకు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. పరిశ్రమ అభివృద్ధికి అన్నీ సంఘాల వారితోనూ సమష్టిగా కృషి చేస్తామ''ని పేర్కొన్నారు. ఈ వేదికపైనే ఇటీవల జాతీయ స్థాయి పురస్కారాలు పొందిన 'హోప్', 'కమ్లి', 'కిట్టు' చిత్ర బృందాల్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామానాయుడు, ఆహుతి ప్రసాద్, జయసుధ, ఏవీయస్, పి.సుకన్య, భార్గవ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











