Don't Miss!
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- News పవన్కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఆగడు: నో టిక్కెట్స్, అంతటా ఔట్ ఆఫ్ స్టాక్!
హైదరాబాద్: మహేష్ బాబు నటించిన ‘ఆగడు' చిత్రం ఈ నెల 19న గ్రాండ్గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేస్తోంది ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ. సోమవారమే ఆన్ లైన్, అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
ఆన్ లైన్ బుకింగ్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే ఫస్ట్ డే టికెట్స్ అన్నీ అమ్ముడు పోయాయి. ఇక థియేటర్ల వద్ద ఇచ్చే అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ కూడా ఈ రోజే అయిపోయాయి. దీంతో అన్ని థియేటర్ల వద్ద ఫస్ట్ డే టికెట్స్ అయిపోయాయి అంటూ బోర్డులు పెట్టేసారు. రేపటిలోగా ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) షోలకు సంబంధించిన టికెట్స్ అన్నీ అయిపోతాయని అంచనా.
భారీగా విడుదల, అడ్వాన్స్ బుకింగ్ కూడా జోరుగా సాగడంతో.....‘ఆగడు' ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్ష్ ఏ రేంజిలో ఉంటాయో? అనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. అటు అభిమానులు కూడా ‘ఆగడు' క్రియేట్ చేయబో రికార్డుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా వెళ్లి ఈ సినిమా నిరభ్యరంతంగా చూడొచ్చని అర్థం. ‘ఆగుడు' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది నిర్మాతలు సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసారు. మరో వారంలో ‘ఆగడు' విడుదల కానుండటంతో అన్ని థియేటర్లలో...కొత్త థియేట్రికల్ ట్రైలర్ ప్రదర్శిస్తున్నారు.
‘ఆగడు' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ దాదాపు 55 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. అయితే సినిమా విడుదల ముందే భారీగా బిజినెస్ జరిగింది. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇలా అన్నీ కలిపి ఇప్పటికే రూ. 75 కోట్ల వరకు నిర్మాతలకు ముట్టాయని అంటున్నారు.
ఈచిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఇది. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు.